అప్పుల భారంతో నేతన్న ఆత్మహత్య

అప్పుల బాధ తాళలేక ఓ యువ నేతన్న ఆత్మహత్యకు పాల్పడ్డాడు. యాదాద్రి భువనగిరి జిల్లా అనాజీపురం గ్రామానికి చెందిన దేవరపల్లి వెంకటేష్ పోచంపల్లి హ్యండ్లూమ్ లో పని చేసేవాడు. అక్కడ వచ్చే జీతం గిట్టు బాటు కాక స్వంతంగా ఇంట్లోనే మగ్గం పెట్టుకొని నేస్తున్నాడు. నేసిన బట్టలకు గిరాకీ రాక పోవడంతో అప్పులు చేసి కుటుంబాన్ని పోషించాడు.

ఇటీవల కాలంలో అప్పులు ఎక్కువ  కావడంతో, అప్పుల బాధ తాళలేక తన ఇంట్లోనే ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతునికి భార్య, ఇద్దరు కొడుకులు, తల్లి ఉన్నారు. కుటుంబం అంతా వెంకటేష్ ఆధారంగానే బతికేది. అర్ధాంతరంగా వెంకటేష్ ఆత్మహత్య చేసుకోవడంతో కుటుంబ పరిస్థితి హృదయ విదారకంగా మారింది. ప్రభుత్వం సహాయం చేసి ఆదుకోవాలని చేనేత సంఘ నాయకులు కోరారు.