ప్రేమించాడని అమ్మాయి పేరెంట్స్ ఏం చేశారో తెలిస్తే షాక్ అవుతారు

 

రోజు రోజుకి ప్రేమ వివాదాలు పెరిగిపోతున్నాయి. తమ కూతుళ్ళ ప్రేమ వ్యవహారంలో విల్లన్లుగా మారుతున్నారు తల్లిదండ్రులు. పరువు కోసం ప్రాణాలు తీయడానికి వెనుకాడట్లేదు. అమృత ప్రణయ్ ల ప్రేమ పెళ్లి వ్యవహారం సహించని అమృత తండ్రి అల్లుడిని కిరాయి హంతకులతో చంపించాడు.

సనత్ నగర్ లో నరసింహాచారి అనే తండ్రి తన కూతురు మాధవి పెళ్లి విషయం చెప్పలేదని కూతురు, అల్లుడిపై కత్తితో దాడికి దిగాడు. ఈ ఘటనలో ఆమెకి బలమైన గాయాలయ్యాయి. మొదట ఆమె పరిస్థితి చాల క్రిటికల్ గా ఉందన్న డాక్టర్లు మెరుగైన చికిత్స ఇచ్చి ఆమె ప్రాణాలను కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. ఆమె త్వరలోనే కోలుకుంటుందని వైద్యులు తెలుపుతున్నారు.

ఇదిలా ఉండగా బెజవాడలో మరో ప్రేమ వ్యవహారం కలకలం రేపుతోంది. కూతురుని ప్రేమిస్తున్న ఒక యువకుడిని, అతని స్నేహితుడిని కిడ్నాప్ చేశారు అమ్మాయి తల్లిదండ్రులు. ఇప్పుడు ఈ విషయం విజయవాడలో సంచలనంగా మారింది. దీనిపై మరింత సమాచారం కింద ఉంది చూడండి.

నాగసాయి అనే యువకుడు బెజవాడకు చెందిన ఒక అమ్మాయిని ప్రేమించాడు. కూతురిని ప్రేమించాడని ఆ అమ్మాయి తల్లిదండ్రులు నాగసాయిని, అతడి స్నేహితుడు మణిదీప్ కుమార్ ను కిడ్నాప్ చేసి కారులో తీసుకువెళ్లారు. ఇది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో అప్రమత్తమైన బెజవాడ పోలీసులు ఆ కారును ఛేజ్ చేసి వారిని పట్టుకున్నారు. యువతీ తల్లిదండ్రులతోపాటు వారికి సహకరించిన మరో తొమ్మిది మందిని పట్టుకుని విచారణ చేపట్టారు అధికారులు.