విశాఖలో చిన్నారిని నరికి చంపి రక్తం తాగిన మేనత్త

ఓ మహిళ అత్యంత క్రూరంగా ప్రవర్తించింది. మానసిక వేధింపులు భరించలేక ఓ మహిళ మృగంలా మారింది. చిన్నారిని నరికి చంపి రక్తం తాగి ఘోరంగా ప్రవర్తించింది.

విశాఖ మన్యంలోని పెదబయలు మండలం లకేయుపుట్టులో ఈ దారుణం జరిగింది. వంతాల రస్మో అనే మహిళ భర్తకు దూరంగా ఉంటూ తన పుట్టింట్లో ఉంటోంది. రస్మో తమ్ముని భార్య, కుటుంబ సభ్యులు రస్మోతో పలుసార్లు గొడవకు దిగారు. అత్తగారింటికి వెళ్లాలని పలుసార్లు ఆమెతో విభేదించారు. దీంతో రస్మో తన తమ్ముడి భార్య పై కక్ష్య పెంచుకుంది.

రస్మో తమ్ముడికి ఆరేళ్ల కుమార్తె ఉంది. మంగళవారం ఉదయం ఆ బాలికను తీసుకొని కట్టెలకు అని సమీపంలోని కొండ మీదకు వెళ్లింది. అక్కడ కట్టెలు నరికే కత్తితో ఆ చిన్నారి పై అత్యంత దారుణంగా దాడి చేసి చంపేసింది. అనంతరం ఆ చిన్నారి రక్తాన్ని రస్మో తాగింది. చిన్నారి అరుపులు విని వచ్చేలోగా దారుణం జరిగింది. అనంతరం రస్మోను గ్రామస్థులు పట్టుకొని చెట్టుకు కట్టేసి దాడి చేశారు. అయితే చిన్నారి తండ్రి ఏడాది క్రితమే మృతి చెందాడు. చిన్నారి మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.