సికింద్రాబాద్ లో భారీ పేలుడు

సికింద్రాబాద్ కాప్రాలో శుక్రవారం ఉదయం భారీ పేలుడు సంభవించింది. మోహన్ రావు అనే వ్యక్తి ఇంట్లో గ్యాస్ సిలిండర్ రీఫిలింగ్ చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే చనిపోగా మరో 8 మందికి తీవ్ర గాయాలయ్యాయి. పేలుడు ధాటికి పక్కనున్న భవనాలు కూడా కూలిపోయాయి. 

కాప్రాలోని మోహన్ రావు అనే వ్యక్తి గ్యాస్ రీఫిలింగ్ చేస్తుంటాడు.ఈ రోజు ఉదయం కూడా గ్యాస్ రీఫిలింగ్ చేస్తుండగా ఒక్కసారిగా సిలిండర్ పేలింది. దీంతో ఒక్కరు అక్కడికక్కడే చనిపోయారు. మరో 8 మందికి తీవ్రగాయాలయ్యాయి. పేలుడు ధాటికి పక్కన ఉన్న ఐదు ఇండ్లు దెబ్బతిన్నాయి. భారీ శబ్దం రావడంతో క్షణాల్లో అక్కడికి జనాలు చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడ్డ వారిని ఆస్పత్రికి తరలించారు. పోలీసులు అక్కడకు చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. స్థానికుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.