బ్రేకింగ్ న్యూస్ : రోడ్డు ప్రమాదంలో నలుగురు బిటెక్ స్టూడెంట్స్ స్పాట్ డెడ్

గుంటూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ రోడ్డు ప్రమాదంలో నలుగురు బిటెక్ స్టూడెంట్స్ స్పాట్ డెడ్ అయ్యారు. గుంటూరు ఆర్వీఆర్ అండ్ సీ కాలేజికి ఏడుగురు విద్యార్దులు సోమవారం ఉదయం కాలేజికి వెళ్లారు. న్యూ ఇయర్ వేడుకలు జరుపుకునేందుకు మద్యాహ్నం ఒంటి గంట సమయంలో వారు కారులో విజయవాడకు బయలుదేరారు.

గుంటూరు రూరల్ మండలం లాల్ పురం వద్దకు వారు చేరుకోగానే కారు అదుపుతప్పి  లారీని ఢికొట్టింది. దీంతో కారులో ఉన్న ఏడుగురిలో నలుగురు విద్యార్దులు అక్కడికక్కడే స్పాట్ డెడ్ అయ్యారు. కారు ప్రమాద సమయంలో 160 స్పీడ్ ఉన్నట్టుగా తెలుస్తోంది. వీరంతా కూడా బిటెక్ సెకండియర్, థర్డ్ ఇయర్ విద్యార్దులుగా పోలీసులు గుర్తించారు. గాయపడ్డ మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.