భార్యపై అనుమానంతో ఆ భర్త చేసిన పని తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..?

ప్రస్తుత కాలంలో వివాహ బంధానికి విలువ లేకుండా పోతుంది మూడుముళ్ల బంధంతో ఒకటైన భార్యాభర్తలు అన్ని విషయాలలోనూ ఒకరినొకరు అర్థం చేసుకుని సర్దుకుపోయి సంసారం చేయకుండా ఒకరి మీద ఒకరు అనుమానాలు పెంచుకుంటున్నారు. ఈ క్రమంలో ఆ అనుమానాలు పెనుభూతంగా మారి ఆత్మహత్యలు, హత్యలకు దారితీస్తున్నాయి. తాజాగా ఇటీవల భార్యపై అనుమానంతో ఒక భర్త ఆమెను దారుణంగా హత్య చేసిన ఘటన మహబూబాబాద్ లో చోటు చేసుకుంది.

వివరాలలోకి వెళ్తే…మహబూబాబాద్ పట్టణంలోని భవాని నగర్ తండాకు చెందిన భాస్కర్, కల్పన గత కొన్ని సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. వీరికి ముగ్గురు కుమార్తెలు .కల్పన చుట్టుపక్కల ఇళ్లల్లో పనిచేస్తూ సంపాదిస్తుండగా.. భాస్కర్ గుమస్తాగా పనిచేస్తున్నాడు. ఇలా కొంతకాలం సంతోషంగా సాగిపోయిన వేరే జీవితంలోకి అనుమానం వచ్చింది. కొంతకాలంగా భార్యపై ఉన్న అనుమానంతో భాస్కర్ తరచు ఆమెతో గొడవ పడుతూ ఉండేవాడు.

ఈ క్రమంలో గురువారం భార్య పనిచేస్తున్న అడ్వకేట్స్ కాలనీలో నడిరోడ్డుపై గొంతు కోసి దారుణంగా హత్య చేసి పారిపోయాడు. ఈ ఘటన గురించి స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రమాదం గురించి స్థానికులను విచారించి వివరాలు తెలుసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. దర్యాప్తులో భాగంగా పరారీలో ఉన్న భాస్కర్ కోసం గాలింపు చర్యలు మొదలుపెట్టారు.