చౌటుప్పల్‌లో దారుణం… మహిళ నగ్న చిత్రాలు తీసి…

నల్లగొండ జిల్లా చౌటుప్పల్‌లో దారుణ సంఘటన జరిగింది. స్నానం చేస్తుండగా ఫోన్ లో వీడియో తీసి అది ఆమెకు చూపించి వాట్సాప్, ఫేస్ బుక్ లో పెడుతానని బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డాడో కామాంధుడు. ఆ తర్వాత ఆమెతో సన్నిహితంగా ఉన్నప్పుడు మరోసారి వీడియో తీసి వాటిని వాట్సాప్ లో మరికొందరికి పంపాడు. విషయం బాధితురాలికి తెలియడంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇంతకీ ఈ సంఘటన ఎక్కడ జరిగిందంటే…

యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం పీపల్ పహాడ్ గ్రామానికి చెందిన ఉప్పుతోట రంగయ్య కొన్ని రోజుల క్రితం  ఓ వివాహిత స్నానం చేస్తుండగా ఆమెకు తెలియకుండా వీడియో తీశాడు. అది ఆమెకు చూపించి తనతో గడపాలని లేకపోతే స్నానం చేస్తున్నప్పుడు తీసిన వీడియోను అందరికి చూపిస్తానని బెదిరించి లొంగదీసుకున్నాడు. పలుమార్లు వివాహితతో గడిపిన రంగయ్య ఆమెతో సన్నిహితంగా ఉన్నప్పుడు మరోసారి ఆమెకు తెలియకుండా వీడియో తీశాడు. రంగయ్య ఇటీవల తాను తీసిన వీడియోను గ్రామంలోని కొంతమందికి పంపించాడు. విషయం తెలుసుకున్న వివాహిత చౌటుప్పల్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.