కక్షతో సొంత తమ్ముడిని హత్య చేసి రెండు రోజుల పాటు శవం పక్కన కూర్చున్న అన్న!

ప్రస్తుత కాలంలో కుటుంబ సభ్యులు స్నేహితులు బంధువుల మధ్య ప్రేమాభిమానాలు కరువయ్యాయి. ఈ క్రమంలోనే చిన్న చిన్న విషయాలకి కుటుంబ సభ్యుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. చిన్నగా మొదలైన గొడవలు చిలికి చిలికి గాలి వానగా మారి ప్రాణాలు బలి తీసుకుంటున్నాయి. ఇలా ఇప్పటికే ఇలాంటి గొడవల కారణంగా ఎంతోమంది హత్యలు చేసిన ఘటనలు వెలుగులోకి వచ్చాయి. అపహస్యం చేస్తున్నాడు అన్న కారణంతో తమ్ముడి మీద కక్ష పెంచుకున్న అన్న అతన్ని దారుణంగా హత్య చేసిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది.

వివరాలలోకి వెళితే…ఈ దారుణ సంఘటన పశ్చిమగోదావరి జిల్లా గణపవరంలో చోటు చేసుకుందీ. గణపవరంలోని గొల్లలదిబ్బ ప్రాంతానికి చెందిన వేగేశ్న నరసింహరాజు(70), వేగేశ్న రామకృష్ణంరాజు (68) సొంత అన్మదమ్ములు. తల్లిదండ్రులు లేకపోవడంతో వీరిద్దరూ కలిసి ఒకే ఇంట్లో జీవిస్తున్నారు. చాలా కాలంగా నరసింహారాజు మానసిక స్థితి సరిగా లేకపోవటమే కాకుండా కొంతకాలంగా అనారోగ్య సమస్యలు కూడా వెంటాడుతున్నాయి. దీంతో నరసింహారాజు తరచు తన అనారోగ్యం గురించి బాధపడుతూ ఉండేవాడు. ఇటీవల కాళ్లూచేతులు లాగుతున్నాయని బాధతో నరసింహారాజు ఏడుస్తుండడంతో.. విసుగు చెందిన అతని తమ్ముడు ‘ఎందుకు ఏడుస్తున్నావు? ఇంటి నుంచి వెళ్లిపో’ అని అన్నపై కేకలు వేశాడు.

ఇంతకాలంగా ఒకే ఇంట్లో కలిసి ఉన్న సంత తమ్ముడే ఇలా తన గురించి ఇలా అపహాస్యంగా మాట్లాడటంతో నరసింహ రాజు తన తమ్ముడి మీద రక్ష పెంచుకున్నాడు. ఈ క్రమంలో ఆదివారం తెల్లవారుజామున అతను నిద్రిస్తున్న సమయంలో ఇంట్లో ఉన్న గుణపం తీసుకొని తమ్ముడు కృష్ణంరాజును దారుణంగా పొడిచి చంపేశాడు. అతన్ని పొడిచి చంపిన తర్వాత నరసింహారాజు బయటికి రాకుండా తన తమ్ముడి శవం పక్కనే రెండు రోజులపాటు కూర్చొని ఉన్నాడు. అయితే శవం నుండి దుర్వాసన రావడంతో నరసింహారాజు బయటికి వచ్చి తన తమ్ముడిని చంపేశారని గట్టిగా మొదలుపెట్టాడు. దీంతో స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న స్థానికులు శవాన్ని పోస్టుమార్టం హాస్పిటల్ కి తరలించారు. ఆ తర్వాత నరసింహారాజుని వైద్యం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.