స్కూల్ లో పేలిన బాంబు… 13 మంది విద్యార్ధులకు తీవ్ర గాయాలు

స్కూల్ లో బాంబు పేలి 13 మంది విద్యార్ధులకు తీవ్ర గాయాలయ్యాయి. జమ్మూకాశ్మీర్ లోని పుల్వామా జిల్లాలో ఓ పాఠశాలలో బుధవారం మద్యాహ్నం బాంబు పేలుడు సంభవించింది. తరగతి గదిలోనే బాంబు పేలడంతో 13 మంది విద్యార్ధులు తీవ్రంగా గాయపడ్డారు. స్కూల్ గోడలు దెబ్బతిన్నాయి. సమాచారం తెలుసుకున్న భద్రత బలగాలు వెంటనే చిన్నారులను ఆస్పత్రికి తరలించి పాఠశాలను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. దీనికి వెనుక ఎవరైనా ఉన్నారా అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు.