మహిళపై మాజీ భర్త సోదరుడు అత్యాచారం..! ఎందుకీ దారుణమంటే..?

రాజస్థాన్ లో ఘోరం జరిగింది. ఓ మహిళ మాజీ భర్త సోదరుడు ఆమెపై అత్యాచారం చేశాడు. కానీ.. అతడిలో పశ్చాత్తాపం లేదు. ఆ మహిళ మాత్రం కుంగిపోయింది. పైగా.. తాను పెళ్లి చేసుకున్న భర్త, తన సోదరి, ఏడేళ్ల కొడుకు ముందే ఈ దారుణం జరిగిందనే బాధ ఆమెను మరింత బాధించింది. పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులకు విస్తుపోయే సమాధానాలు ఇచ్చాడు. చేసిన పనికి విచిత్రమైన కారణాలు చెప్తూండటం పోలీసులనే ఆశ్చర్యపరచింది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం..


రాజస్థాన్ లోని బరాన్ జిల్లాలో ఓ మహిళ తన భర్త నుంచి విడిపోయింది. తనకు పిల్లలు పుట్టలేదనే కారణంతో ఆమే భర్త నుంచి విడిపోయింది. ఊరి పెద్దలే ఇందుకు పంచాయతీ చేసారు. తర్వాత ఆమె మరో వివాహం చేసుకుంది. వీరికి ఒక సంతానం కలిగారు. అయితే.. ఒక రోజు తన ప్రస్తుత భర్త, తన బిడ్డ, తన చెల్లితో కలిసి భర్త ఇంటికి వెళ్తోంది. వారు సాజావార్ ఊరి చివర ప్రాంతానికి వచ్చిన సమయంలో మహిళ మాజీ భర్త సోదరుడు, మరో నలుగురు వారిని అడ్డగించారు. ముందు కంగారుపడినా వాళ్లలో ఒక వ్యక్తిని గుర్తుపట్టింది. అతను తన మాజీ భర్త సోదరుడు. వాళ్లను దాటి వెళ్లిపోతున్న వీరిని ఆ నులుగరు అడ్డగించారు. భర్త ముందే ఆ మహిళపై దౌర్జన్యం చేసాడు మాజీ భర్త సోదరుడు. మిగిలిన ముగ్గురూ భర్త, సోదరి, బిడ్డను కత్తులతో బెదిరించి పక్కకు తీసుకెళ్లారు.

వారిని తాళ్లతో కట్టి బంధించేశారు. వీరినంతా పక్కనే ఉన్న పొదల్లోకి తీసుకెళ్లారు. భర్త ముందే మాజీ భర్త సోదరుడు ఆమెపై అత్యాచారం చేశాడు. జరుగుతున్న తంతును చూసి వారంతా నిస్సహాయ స్థితిలో ఉండిపోయారు. ఈ దారుణం తర్వాత వారిని అక్కడే వదిలేసి వెళ్లిపోయారు. బాధితులు సమీప పోలిస్ స్టేషన్ కు వెళ్లి జరిగిన దారుణాన్ని చెప్పుకొచ్చారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. నిందితుల్లో మాజీ భర్త సోదరుడితోపాటు మరొక వ్యక్తి దొరికాడు. పోలీసు విచారణలో.. మహిళ వెళ్లిపోయిన తర్వాత ఊళ్లో తమ పరువు పోయిందని పేర్కొన్నాడు. ఆ కారణంతోనే ఆమెపై అత్యాచారం చేసినట్టు తెలిపాడు. భర్తకు లేని కోపం సోదరుడికి రావడంపై పోలీసులు విస్మయం వ్యక్తం చేశారు. మిగిలిన నిందితుల కోసం గాలిస్తున్నారు.