సైఫాబాద్ సీఐ సైదిరెడ్డి పై దాడి (వీడియో)

హైదరాబాద్ లక్డీకపూల్ లోని గ్లోబల్ హస్పిటల్ వద్ద ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన శబినా బేగం అనే మహిళ చికిత్స పొందుతూ మృతి చెందింది.  శబీనా బంధువులు ఆగ్రహంతో ఆసుపత్రి ఫర్నిచర్ ను ధ్వంసం చేశారు. శబీనా మృతికి డాక్టర్ల నిర్లక్ష్యమే కారణమని వారు ఆరోపించారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది.

విషయం తెలుసుకున్న పోలీసులు ఆసుపత్రికి చేరుకొని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.  ఈ సమయంలో కొంత మంది బాధితురాలి బంధువులు సైఫాబాద్ సీఐ సైదిరెడ్డి పై దాడి చేశారు. సీఐ గల్ల పట్టుకొని నెట్టి వేశారు. పక్కనే ఉన్న పోలీసులు వారించిన కూడా వారు వినకుండా దురుసుగా ప్రవర్తించారు. సీఐ సైదిరెడ్డి పై దాడి చేసిన వీడియో కింద ఉంది చూడండి.