ఒడిశాలో దారుణం.. కూతురిని చంపి రాత్రికి రాత్రే దహనం చేసిన తల్లి తండ్రులు..?

సాధారణంగా పిల్లలు అంటే తల్లిదండ్రులకు అమితమైన ప్రేమాభిమానాలు ఉంటాయి. పిల్లలు ఎంత పెద్ద తప్పు చేసినా కూడా తల్లిదండ్రులు వారిని క్షమించి వారిని సరైన మార్గంలో పెట్టటానికి ప్రయత్నిస్తారు. కానీ ఇటీవల ఒడిస్సాలో మాత్రం ఒక ధారణ సంఘటన చోటుచేసుకుంది. కన్న తల్లిదండ్రులే కూతురిని హత్య చేసి ఆధారాలు దొరకకుండా రాత్రికి రాత్రి కాల్చి బూడిద చేసిన ఘటన సంచలనంగా మారింది. ఋతురాలి సోదరి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ దారుణ సంఘటన వెలుగులోకి వచ్చింది.

వివరాలలోకి వెళితే…ఒడిశాలోని పూరీ జిల్లాలోని గోప్ ప్రాంతంలో సోనాలి మోహరానాగా 17 ఏళ్ల బాలికను సవతి తల్లి,కన్న తండ్రి కలిసి హత్య చేశారు. ఆ తర్వాత హత్యకి సంబందించిన ఆధారాలు బయట పడకుండా రాత్రికి రాత్రే యువతిని కాల్చి బూడిద చేసి ఆ బూడిద కూడా మాయం చేశారు. అయితే మృతురాలి అక్క రంజిత మోహరానా అనుమానంతో గోప్‌ ఠాణా పోలీసులు ఫిర్యాదు చేసింది. బాధితురాలి సోదరి చేసిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతురాలి తండ్రి నిందితుడు అయిన దుర్గాచరణ్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

దుర్గాచరణ్‌ మొదటి భార్య 2018లో మరణించింది. ఆ తర్వాత 2020లో మమతా ఓజా అనే మహిళను రెండో వివాహం చేసుకున్నాడు. దుర్గా చరణ్ రెండవ పెళ్లి చేసుకున్న తర్వాత సోనాలిని ఆమె తండ్రి, సవతి తల్లి తో పాటు ఆమె సోదరుడు జీవన్ ఓజా తరచూ చిత్రహింసలకు గురి చేసేవారు. ఈ క్రమంలోనే ఇటీవల సోనాలిని సవతి తల్లి తన తండ్రితో కలిసి హత్య చేసినట్లు రంజిత పోలీసులకు వెల్లడించింది. ఇటీవల సోనాలి మరణ వార్త విని గ్రామానికి వచ్చిన రంజిత తన తండ్రి మీద అనుమానం రావటంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన చెల్లిని దారుణంగా చంపి ఎవరికి అనుమానం రాకుండా రాత్రికి రాత్రి స్మశాన వాటికలో దహనం చేసి ఆ బోటి దాన కూడా దాచారని రంజిత తల్లిదండ్రుల మీద ఆరోపించింది. ఈ హత్యా నేరంలో ఇప్పటికే దుర్గా చరణ్ నీ అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు