కర్ణాటకలో దారుణం.. తనని కాదని వేరే వ్యక్తిని పెళ్ళి చేసుకున్నందుకు దారుణానికి పాల్పడిన ప్రియుడు..?

woman kills her own brother in guntur dist in ap

ప్రస్తుత కాలంలో యువతీ యువకులు అతి చిన్న వయసులోనే ప్రేమలో పడి తల్లిదండ్రులను ఎదిరించి మరి ప్రేమ వివాహాలు చేసుకుంటున్నారు. మరి కొంతమంది మాత్రం తల్లిదండ్రులను కాదనలేక ప్రేమించిన వారిని దూరం చేసుకుని వేరొకరిని పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. అయితే కొంతమంది యువకులు తమ ప్రేమని కాదన్నందుకు ప్రేమను మాదులుగా మారి యువతుల పట్ల దారుణాలకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలో యువతులను కిరాతకంగా హత్యలు చేస్తున్నారు. తాజాగా ఇటువంటి దారుణ ఘటన కర్ణాటకలో చోటు చేసుకుంది.

వివరాలలోకి వెళితే….బెంగళూరు సమీపంలోని దేవనహళ్లి తాలూకా అవటి గ్రామంలో గురువారం రాత్రి జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సౌమ్య, సుబ్రమణ్య అనే యువతీ యువకులు ఒక కాఫీ డే లో పనిచేసేవారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడి ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఇలా కొంతకాలం గడిచిన తర్వాత సుబ్రమణ్య అక్కడ ఉద్యోగం మానేశాడు. దీంతో సౌమ్య కూడా అతనిని దూరం పెట్టింది. చాలా కాలంగా సౌమ్య అతడిని దూరం పెట్టడంతో సుబ్రమణ్య మనస్థాపానికి గురయ్యాడు. అంతేకాకుండా 15 రోజుల క్రితం సౌమ్య వేరే వ్యక్తిని పెళ్లి చేసుకోవడంతో సుబ్రమణ్య తీవ్ర అగ్రహానికి గురై పుట్టింటికి వచ్చిన సౌమ్య ని దారుణంగా 20 సార్లు కత్తితో పొడిచే హత్య చేశాడు.

ఆ తర్వాత అక్కడి నుండి పరారయ్యాడు. సౌమ్య కేకలు విన్న స్థానికులు వెంటనే అక్కడికి చేరుకొని రక్తంలో పడి ఉన్న సౌమ్యని వెంటనే ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో ప్రాణాలు కోల్పోయింది. ఇక సౌమ్య ని హత్య చేసిన తర్వాత సుబ్రమణ్య కూడా విషం తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ క్రమంలో కుటుంబ సభ్యులు అతనిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. సుబ్రమణ్య ప్రస్తుతం బెంగళూరులోని ఆకాష్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతని ఆరోగ్య పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు డాక్టర్లు వెల్లడించారు.