తెలంగాణలో మరో పరువు హత్య కలకలం

తెలంగాణలో పరువు హత్యల కలకలం రేగుతోంది. మిర్యాలగూడ అమృత ప్రణయ్, హైదరాబాద్ మనోహరా చారి ఘటన మరువక ముందే అలాంటి ఘటనే కరీంనగర్ జిల్లాలో జరిగింది.

కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం తాటికల్ లో గడ్డి కుమార్ అనే యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. గ్రామంలో ఉంటున్న కుమార్ ఓ యువతిని కొంతకాలంగా ప్రేమిస్తున్నాడు. విషయం తెలుసుకున్న యువతి కుటుంబ సభ్యులు కుమార్ ని బెదిరించి తమ అమ్మాయిని మరిచిపోవాలన్నారు.

హత్యకు గురైన కుమార్

తమ అమ్మాయిని మర్చిపోకపోతే చంపేస్తామని కూడా బెదిరించినట్టు తెలుస్తోంది. అయినప్పటికి కూడా కుమార్ ప్రేమాయణం కొనసాగించాడు. ఇదిలా ఉంటే కుమార్ సోమవారం అనుమానాస్పదంగా మృతి చెందాడు. ఇద్దరి కులాలు వేరుకావడంతోనే కుమార్ ని చంపేశారని గ్రామస్థులు తెలిపారు.  

వంకాయల గూడెం గ్రామానికి చెందిన అమ్మాయి, కుమార్ ప్రేమించుకున్నారు. వారిద్దరి ఇంట్లో తెలియడంతో గొడవలయ్యాయి. ఆ తర్వాత పెళ్లికి ఒప్పుకున్నారు. అమ్మాయి ఇంటర్ సెకండియర్ చదువుతోంది. అమ్మాయి దీపావళి తర్వాత మేజర్ అవుతుందని దీపావళి తర్వాత పెళ్లి చేసుకుందామని ఒప్పుకున్నారు.  ఇంతలోనే ఇరు కుటుంబాల మధ్య గొడవలు వచ్చాయి. అమ్మాయిని మర్చిపోవాలని బెదిరింపులు కూడా జరిగాయి. ఇంతలోనే సోమవారం రాత్రి కుమార్ అనుమానాస్పదంగా చనిపోయాడు. విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 

 

యువతి బంధువులే కుమార్ ను చంపేసారని, ఇది ఖచ్చితంగా పరువు హత్యేనని యువకుని బంధువులు ఆందోళన చేశారు. దీంతో కుమార్ స్వగ్రామంలో ఉద్రికత్త నెలకొంది. పోలీసు జీపు అద్దాలు ధ్వంసం చేసి హూజురాబాద్ రహదారిపై బైఠాయించారు. దీంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జాం అయ్యింది.

దీంతో యువతి బంధువులే కుమార్‌ను చంపేశారని ఇది ఖచ్చితంగా పరువు హత్యే అని యువకుడి బంధువులు అంటున్నారు. కుమార్ గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. విచారణ కోసం వచ్చిన పోలీసులను అడ్డుకున్నారు. జీపు అద్దాలను ధ్వంసం చేశారు.

కుమార్ ని చంపిన వారిని వెంటనే పట్టుకొని శిక్షించాలని వారు డిమాండ్ చేశారు. గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.