మధ్యతరగతి వాళ్లకు సూపర్ స్కీమ్.. రూ.100 పొదుపుతో రూ.55 లక్షలు పొందే ఛాన్స్!

మధ్య తరగతి ప్రజలలో చాలామంది డబ్బులను పొదుపు చేయడానికి ఆసక్తి చూపిస్తుంటారు. అయితే తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం పొందాలని భావించే వాళ్లు పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ స్కీమ్ లో పెట్టుబడులు పెడితే మంచిది. ఈ స్కీమ్ లో రోజుకు 100 రూపాయల చొప్పున నెలకు రూ.3000 ఇన్వెస్ట్ చేస్తే ఏకంగా రూ.55 లక్షలు పొందే అవకాశం అయితే ఉంటుంది. ఎలాంటి రిస్క్ తీసుకోవడం ఇష్టం లేని వాళ్లు ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేస్తే మంచిది.

ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేసే డబ్బు వల్ల వేర్వేరు ప్రయోజనాలను పొందే అవకాశం ఉంటుంది. ట్యాక్స్ సేవింగ్ చేసుకోవాలని భావించే వాళ్లు ఈ స్కీమ్ పై దృష్టి పెడితే మంచిది. ఈ స్కీమ్ పై కనీసం 7 శాతం రాబడిని పొందే అవకాశం ఉంది. ఈ స్కీమ్ మెచ్యూరిటీ కాలం 15 సంవత్సరాలుగా ఉండనుంది. 35 సంవత్సరాల పాటు ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేస్తే 55 లక్షల రూపాయలు సొంతమయ్యే అవకాశం ఉంటుంది.

ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేసే మొత్తం రూ. 12.6 లక్షలు కాగా రాబడి మాత్రం 42 లక్షల రూపాయలుగా ఉంటుంది. ఈ స్కీమ్ లో ఒక ఆర్థిక సంవత్సరంలో కనీసం 500 రూపాయలు డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. ఈ స్కీమ్ లో డిపాజిట్ చేసిన డబ్బులకు రుణ సౌకర్యం ఉంటుంది. పిల్లల పేరుతో పీపీఎఫ్ అకౌంట్ ఓపెన్ చేస్తే ఎన్నో లాభాలు పొందే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు.

ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేస్తే దీర్ఘకాలంలో ఎక్కువ మొత్తం లాభాలను పొందే అవకాశం అయితే ఉంటుంది. గరిష్టంగా లక్షన్నర రూపాయల వరకు ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేసే అవకాశం ఉంటుంది. దీర్ఘకాలికంగా పెట్టుబడులు పెట్టాలని భావించే వాళ్లకు ఈ స్కీమ్ ఎంతగానో ప్రయోజనం ఉంటుంది. పీపీఎఫ్ స్కీమ్ చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని చెప్పవచ్చు.