‘నిను వీడ‌ని నీడ‌ను నేనే’ కలెక్షన్స్ రిపోర్ట్

‘నిను వీడ‌ని నీడ‌ను నేనే’కలెక్షన్స్ రిపోర్ట్

వరస ఫ్లాఫ్ లతో దూసుకుపోతున్న హీరో సందీప్ కిషన్ తాజాగా ఓ హర్రర్ థ్రిల్లర్ చిత్రంతో మన ముందుకు వచ్చాడు. నూతన దర్శకుడు కార్తీక్ రాజు డైరక్షన్ లో వచ్చిన ‘నిను వీడ‌ని నీడ‌ను నేనే’ చిత్రం నిన్న శుక్రవారం రిలీజైంది. నార్మల్ రివ్యూలతో ఓపెన్ అయినా బాక్సాఫీస్ వద్ద డీసెంట్ టాక్ తో మంచి కలెక్షన్స్ ను సాధిస్తోంది.సినిమాకు ఇంట్రస్టింగ్ కాన్సెప్ట్ ఉన్నా…దాన్ని ఎగ్జిక్యూట్ చేయటంలో దర్శకుడు ఫెయిలయ్యాడనే విమర్శలు వచ్చాయి. అయితే ఈ సినిమా ఫస్ట్ డే కలెక్షన్స్ బాగుండటంతో సందీప్ కిషన్ ఫుల్ ఖుషీగా ఉన్నాడు.

ఫస్ట్ డే కలెక్షన్స్ లో తన గత సినిమాల కంటే.. సందీప్ కిషన్ ఈ సినిమాతో ఏకంగా ఆరు రెట్లు ఎక్కువ కలెక్షన్స్ ను రాబట్టాడు. మొదటి రోజు ఈ సినిమాకు గ్రాస్ 1.70 కోట్లు వచ్చాయి. ఇప్పటికే అన్ని ఏరియాల్లో శని ఆదివారాల్లో కూడా ఈ సినిమా ప్రీ బుకింగ్ బాగుంది.

అలాగే ఈ రోజు ఉదయం ఏఎంబీ సినిమాస్‌లో సినిమా చేసేందుకు వెళ్లిన సందీప్‌ కిషన్‌ తండ్రి ఫస్ట్ హాఫ్ పూర్తయన వెంటనే పుత్రోత్సాహంతో సందీప్‌కి మెసేజ్‌ చేశాడు.

https://twitter.com/sundeepkishan/status/1149937614599802880

<

p style=”text-align: justify”>‘మార్నింగ్‌ షోకు థియేటర్‌ 90 శాతం నిండింది. ఫస్ట్ హాప్ సూపర్‌’ అంటూ మెసేజ్ చేశాడు. ఈ సంభాషణ స్క్రీన్‌ షాట్‌ను షేర్‌ చేసిన సందీప్‌ ‘మీ తల్లిదండ్రుల నవ్వుకు మీరు కారణమవ్వటమే నిజమైన ఆనందం. ఈ మెసేజ్‌ చూసి నా కళ్లలో నీళ్లు తిరిగాయి. నాకు ఇంతటి విజయాన్ని అందించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు’ అంటూ ట్వీట్ చేశారు.