తిరుప‌తి.. పీజీఆర్ థియేట‌ర్‌..ఫ‌స్ట్ షో!

సంక్రాంతి పండుగ సంద‌ర్భంగా చిత్తూరు జిల్లాలోని నారావారి ప‌ల్లెకు చేరుకున్న ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు కుటుంబ స‌భ్యులు ఆదివారం సాయంత్రం ఫ‌స్ట్ షో సినిమాకెళ్లారు. తిరుప‌తిలోని పీజీఆర్‌ థియేటర్‌లో `ఎన్టీఆర్‌- క‌థానాయ‌కుడు` మూవీని తిల‌కించారు. చంద్ర‌బాబు కుమారుడు, మంత్రి నారా లోకేశ్‌, కోడ‌లు బ్రాహ్మణిలతో పాటు నందమూరి రామకృష్ణ, ఇతర కుటుంబ సభ్యులు సినిమాను తిల‌కించారు. ప్రేక్ష‌కుల‌తో క‌లిసి వారు సినిమాను ఎంజాయ్ చేశారు. థియేట‌ర్‌కు వ‌చ్చిన నారా కుటుంబానికి పీజీఆర్ థియేట‌ర్ యాజ‌మాన్యం ఘ‌న స్వాగ‌తం ప‌లికింది. తాను ఇదివ‌ర‌కే సినిమా చూశాన‌ని, ప్రేక్షకులు, అభిమానుల‌ మధ్య కూర్చుని మరోసారి సినిమా చూడటానికి వ‌చ్చిన‌ట్టు బాల‌కృష్ణ సోద‌రి లోకేశ్వరి తెలిపారు.