హిట్ కొట్టినట్లే: అఖిల్ ‘మిస్ట‌ర్ మ‌జ్ను’ టాక్, కథ

అఖిల్ అక్కినేని హీరోగా తొలి ప్రేమ ఫేమ్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో భారీ నిర్మాత బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ నిర్మించిన యూత్‌పుల్ ఎంటర్‌టైనర్ ‘మిస్టర్ మజ్ను’. శ్రీవెంకటేశ్వర సినీ చిత్ర ఎల్‌ఎల్‌పి పతాకంపై రూపొందిన ఈ చిత్రానికి థమన్ సంగీతం అందించారు. ఈ చిత్రం ఈ రోజు (జనవరి 25న) ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం భారీగా విడుదల అవుతోంది. ఇప్పటికే అమెరికాలో షోలు పడిపోయాయి. అక్కడ నుంచి అందుతున్న రిపోర్ట్ ప్రకారం ఈ చిత్రం కథ,టాక్ చూద్దాం.

స్టోరీ లైన్ ఏమిటంటే…విదేశాల్లో ఉండే నిక్కీ (నిధి అగర్వాల్) కు రాముడు లాంటి భర్త కావాలని కోరుకుంటుంది. అయితే అందుకు పూర్తి కాంట్రాస్ట్ విక్కీ (అఖిల్) క్యారక్టర్. విక్కీ కూడా విదేశాల్లో ఉంటూ…కాసనోవాలా అమ్మాయిలతో రచ్చ రచ్చ చేస్తూంటాడు. విక్కీ ,నిక్కి ఇద్దరూ ఇండియాకు వచ్చి తమ కజిన్ కు పెళ్లిలో కలుసుకుంటారు. విక్కీతో ప్రేమలో పడిపోతాడు నిక్కి. అయితే రెండు నెలలు డేటింగ్ కు ఆమెను ఒప్పిస్తాడు. అయితే అక్కడే చిన్న డిస్ట్రబెన్స్ లు వచ్చి ఇద్దరూ విడిపోతారు. ఆ తర్వాత ఆమెను మిస్సైన ఫీలింగ్ వచ్చి..నిక్కీ చదువుతున్న కాలేజిని వెతుక్కుంటూ వెళ్తాడు. తిరిగి ఆమె ను ఎలా ఒప్పిస్తాడు. ఎలా ఇద్దరూ ఒకటి అవుతారనేది మిగతా కథ.

మజ్ను …ఓ న్యూ ఏజ్ లవ్ స్టోరీ. ఫస్టాఫ్ సూపర్ గా ఉంది. సెకండాఫ్ మాత్రం పూర్తి ఫార్ములగా సాగింది. ఫస్టాఫ్ లో ఎమోషన్ సీన్స్ లో దర్శకుడు తన ప్రతిభను చూపాడు. ముఖ్యంగా ఇంటర్వెల్ దగ్గరకు వచ్చేసరికి ఫెరఫెక్ట్ కాంప్లిక్ట్ ని ఎస్టాబ్లిష్ చేసి ముగించాడు. ఇక సెకండాఫ్ లో అందుకు తగ్గ రిజల్యూషన్ ఇవ్వటంలో మాత్రం తడబడ్డాడు.

ఓవరాల్ గా ..ఫ్యామిలీ సీన్స్ తో పాటు ఫన్ ని కూడా యాడ్ చేసి ఫైనల్ గా డైరెక్టర్ ఫీల్ గుడ్ ఫిల్మ్ ను ఇచ్చాడని చెప్తున్నారు. కొంచెం రొటీన్ గానే అనిపించినా, సెకండ్ హాఫ్ స్లోగా అనిపించినప్పటికి హీరో, హీరోయిన్ ల మధ్య వచ్చే కెమిస్ట్రీ సీన్స్ సినిమాని నిలబెట్టాయి.

అఖిల్ ఈ చిత్రంపై భారీ ఆశలే పెట్టుకున్నాడు. మరో వైపు ఈ చిత్రానికి సోలో రిలీజ్ కూడా కలిసిరానుంది. మరి ఈ చిత్రంతోనైనా అఖిల్ మొదటి విజయాన్ని ఖాతాలో వేసుకుంటాడోలేదో చూడాలి.