శ్వేతాబసు పెళ్లైపోయింది…తెలుగు నుంచి ఎవరెళ్లారు?

‘కొత్తబంగారు లోకం’ చిత్రంతో తెలుగువారికి పరిచయం అయిన శ్వేతాబసు వివాహం చేసుకుంది. పూణేలో నిన్నరాత్రి సన్నిహితుల సమక్షంలో ఫిల్మ్ మేకర్ రోహిత్ మిట్టల్ ను శ్వేత పెళ్లి చేసుకుంది. బంధువులు, సన్నిహితులు, కుటుంబ సభ్యులు ఈ వేడుకకు హాజరయ్యి ఆశ్వీరదించారు. ఈ సందర్భంగా రెండు కుటుంబాలకు చెందిన సభ్యులు డ్యాన్సులతో అలరించారు.

బెంగాలీ సంప్రదాయం ప్రకారం జరిగిన ఈ పెళ్లి వేడుకలో పింక్‌ కలర్‌ సిల్క్‌ చీరలో శ్వేతా బసు మెరిసిపోయింది. ఈ వివాహ వేడుకలకు సంబంధించిన ఫొటోలను శ్వేతా బసు ప్రసాద్ ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంది. ఆమె భర్త రోహిత్ కూడా ‘ఇక అయిపోయింది’ అని తన పెళ్లి ఫొటోను పేస్ బుక్ లో పోస్ట్ చేశారు. ఇక ఈ వివాహానికి తెలుగులో ఎవరికి పిలుపులు రాలేదని తెలుస్తోంది. నిర్మాత దిల్ రాజు కు కానీ, హీరో వరుణ్ సందేశ్ కు కానీ, డైరక్టర్ శ్రీకాంత్ అడ్డాల కు కానీ పెళ్లి పిలుపులు చెప్పలేదని సమాచారం. ఇక్కడ జరిగిన చేదు అనుభవాలతో  ఆమె టాలీవుడ్ తో ఇంటరాక్షన్ పెట్టుకోవటానికి ఇష్టపడలేదని సమాచారం.

మక్డీ చిత్రం ద్వారా బాలనటిగా సినీరంగంలోకి వచ్చిన శ్వేత.. ఆ సినిమాకు జాతీయ అవార్డును సైతం అందుకున్నారు. తెలుగులో కొత్త బంగారు లోకం, కళవర్ కింగ్ సహా పలు చిత్రాల్లో శ్వేత నటించింది. ప్రస్తుతం ముంబైకే పరిమితమైన శ్వేతా బసు.. పలు టీవీ సీరియల్స్ లో నటిస్తూ బిజీగా ఉన్నారు.