శృతిహాసన్ లేటెస్ట్ డెసిషన్, ఫ్యాన్స్ కు పెద్ద షాక్

శృతిహాసన్ తెలుగులో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది. గబ్బర్ సింగ్ వంటి సూపర్ హిట్ సినిమాతో ఆమె ఇక్కడ బిజీ అయ్యింది. కమల్ కూతురుగా ఇండస్ట్రీకు వచ్చిన ఆమె అనతికాలంలోనే తనకంటూ ఐడెంటెటీ క్రియేట్ చేసుకోగలిగింది. అయితే గత కొద్ది రోజులుగా ఆమె వెండితెరపై కనపించటం లేదు. ఏ సినిమాలు ఒప్పుకోలేదు. పెళ్లి చేసుకుంటోందని, అందుకే సినిమాలు కమిటవ్వటంలేదని వార్తలు వచ్చాయి.

https://www.youtube.com/watch?v=betW1TvvQ0M

అయితే ఇప్పుడు హఠాత్తుగా ఆమె బుల్లితెరపై ఓ షో కు వ్యాఖ్యాతగా దర్శనమివ్వబోతూ షాక్ ఇచ్చింది. ఈ నెల 28 నుంచి శ్రుతిహాసన్‌ చిన్నతెర ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని కలిగించబోతోంది. హలో సాగో అంటూ బుల్లితెర ప్రేక్షకల ముందుకు రాబోతోంది.

ప్రపంచ వ్యాప్తంగా ఓటీటీ వీడియో సేవలందిస్తున్న వైవ్‌ సంస్థ, మోషన్‌ కంటెంట్‌ గ్రూప్‌తో కలిసి వైవ్‌ హలో సాగో పేరుతో ఈ షోని డిజైన్ చేసింది. ఈ కార్యక్రమంలో స్టార్స్ తమ వ్యక్తిగత విషయాలను వెల్లడించి ప్రేక్షకుల ముందు తమ మరో కోణాన్ని ఆవిష్కరిస్తారు. తమ నిజ జీవితాల్లోని సీక్రెట్స్ ను ప్రేక్షకులతో పంచుకుంటారని నిర్వాహకులు చెప్పారు.


శ్రుతిహాసన్‌ మాట్లాడుతూ… సాధారణంగా ఎంటర్‌టెయిన్‌మెంట్‌ రంగానికి చెందిన వారు వారి వ్యక్తిగత విషయాల గురించి బయట ప్రపంచానికి చెప్పుకోవడానికి ఇష్టపడరు. అయితే ఈ వైవ్‌ హలో సాగో కార్యక్రమం ద్వారా ప్రేక్షకులు స్టార్స్ మరో యాంగిల్ చూడగలం. స్టార్స్ నిజాయితీగా చెప్పే విషయాలు, వారి లైఫ్ జర్నీని తెలుసుకునే అవకాశం ఉంటుందన్నారు.

ఈ కార్యక్రమంలో తానూ ఒక భాగం కావడం సంతోషంగా ఉందని అన్నారు. కాగా 13 ఎపిసోడ్స్‌తో కూడిన ఈ కార్యక్రమం ఈ నెల 28 నుంచి ఆదివారం రాత్రి 8.30 గంటలకు వైవ్‌ యాప్‌తో పాటు సన్‌ టీవీలోనూ ఏకకాలంలో ప్రసారం అవుతుందని నిర్వాహకులు వెల్లడించారు.

ఇది ఆమె ఫ్యాన్స్ జీర్ణించుకోలేని విషయం. చక్కగా సినిమా ఆఫర్స్ ఉన్నప్పుడు ఇలా టీవికు వెళ్లటం ఏమిటి అని అంటున్నారు. టీవి అంటే ..సినిమాల్లో రిటైరైన వారికి పునరావాసం లాంటిది. అలాంటిది సినిమాల్లో స్టార్ గా వెలుగుతున్నప్పుడే ఈ డెసిషన్ తీసుకోవటం ఏమిటి అంటున్నారు ఆమె ఫ్యాన్స్. మరి ఆమె ఏం సమాధానం చెప్తుందో చూడాలి.