అక్కా చెల్లెళ్లు బికినీలో రెచ్చిపోయారు

తెలుగు తెర మీద నిన్నమొన్నటి వరకు మెరిసిన బ్యూటీ కృతి సనమ్. తర్వాత ఇప్పుడు బాలీవుడ్ లో సెటిలై పోయింది ఈ ముద్దుగుమ్మ. ఈమెకు సోషల్ మీడియాలో ఫాలోయింగ్ భారీగానే ఉంది. ఇన్స్టాగ్రామ్ లో 15 మిలియన్ ఫాలోయర్లు ఉన్నారు కృతి సనమ్ కు. రెగ్యులర్ గా తన అకౌంట్ అప్ డేట్ చేస్తూ ఉంటుంది సనమ్.

తాజాగా కృతి సనమ్ తన ఫ్యామిలీతో మాల్దీవ్స్ ట్రిప్ కు వెళ్లింది. కృతికి ఆమెలాగే అందమైన చెల్లెలు  ఉంది. ఆమె పేరు నూపూర్ సనమ్. వెకేషన్ కు వెళ్లడంతో మాల్దీవ్స్  లో ఇద్దరు చెల్లెల్లు రెచ్చిపోయారు. అక్కడి తాజ్ హోటల్ స్విమ్మింగ్ పూల్ లో దిగిన ఫొటోలను తమ ఇన్స్టా అకౌంట్ లో ఇద్దరూ పోటీపడి మరీ షేర్ చేశారు. 

ఈ బికినీ ఫొటోలో అక్క బ్లాక్ బికినీలో అదరగొడితే చెల్లి పింక్ బికినీలో దర్శనమిచ్చింది. ఇక ఇక్కడ అసలు మజా ఏమంటే? ఈ ఫొటోలకు ‘‘ఆయన ఎవరైనా కావొచ్చు… ముందు మాత్రం ఈమె. నువ్వుంటే నేను సంతోషంగా ఉంటా… నా మనసుకు ఈ విషయం తెలుసు’’ అని క్యాప్షన్ ఇచ్చి మరీ కృతి సనమ్ పోస్టు చేసింది.

కాబోయే భర్త కంటే ముందు చెల్లి నూపూర్ సనమ్ ముఖ్యం అంటోంది ఈ అక్క. కృతి సనమ్ బాయ్ ఫ్రెండ్ సుశాంత్ సింగ్ రాజ్ పుత్ అని బాలీవుడ్ లో ఎప్పటినుంచో ప్రచారం సాగుతున్నది. మరి ఆయన ఏమంటాడో అన్నది ఇప్పుడు సస్పెన్స్. త్వరలోనే నూపూర్ సనమ్ ను కూడా బాలీవుడ్ తెర మీదకు తీసుకొస్తుందా అన్నది చూడాలి. అందుకే చెల్లి బికినీ ఫొటోలు సోషల్ మీడియాలో పోస్టు చేస్తుందా ఏంటి అని నెటిజన్లు ఆసక్తి చూపుతున్నారు.