ప్రీతి జింటా కు కోపమొచ్చింది

ఇప్పుడు సినిమా రంగంలో “మీ టూ ” ఉద్యమం సాగుతుంది . అన్ని భాషల్లో  నటిస్తున్న హీరోయిన్లు  అవమానాలకు , అవహేళనలకు , సెక్స్ ఎక్సప్లయ్ టెన్షన్ కు గురవుతున్నారు . మీ టూ ఉద్యమ ప్రభావంతో తమకు జరిగిన చేదు అనుభవాలను ధైర్యంగా ముందుకొచ్చి చెబుతున్నారు .

తాజాగా ప్రీతి జింటా కూడా ఓ టెలివిజన్ ఛానల్ కు ఇదే విషయం మీద ఇంటర్వ్యూ ఇచ్చింది. ఈ ఇంటర్వ్యూ ప్రసారమైన తరువాత సోషల్ మీడియా లో విమర్శలు వెల్లువెత్తాయి. తీరా చుస్తే.. తానూ చెప్పిన దానికి సంబంధం లేకుండా ఏవేవో ఉండటంతో ప్రీతి ఆగ్రహంతో ఊగిపోయింది. ఎడిటింగ్లో మాయజేసి నన్ను అవమానిస్తారా అని ఆ జర్నలిస్ట్  మీద మండిపడింది. తారల ఇంటర్వ్యూ  ఎడిటింగ్ లో మార్చి చూపించి అవమాన పర్చడం నిజంగా బాధాకరం అంటూ వాపోయింది.