ప్రియాంక ,నిక్ వివాహ విందులో ప్రధాని

ప్రియాంక ,నిక్ జోనస్ రిసెప్షన్  మంగళవారం నాడు ఢిల్లీలో కన్నుల పండుగగా జరిగింది . డిసెంబర్ 2,3 తేదీల్లో జోడీ పూర్ లోని  ఉమైద్  ప్యాలస్ లో వీరిద్దరి వివాహం జరిగింది . వివాహం జరగడానికి ముందు ప్రియాంక , నిక్ ఇద్దరు ముంబై నుంచి ఢిల్లీ వచ్చి ప్రధాని నరేంద్ర మోడీకి ఆహ్వాన పత్రిక అందించారు . అయితే ఆయన వివాహానికి రాలేను, రిసెప్షన్కు వస్తానని చెప్పారేమో , అందుకే వివాహం జరిగిన వెంటనే ముంబై లో కాకుండా ఢిల్లీలో భారీగా వివాహ విందు ఏర్పాటు చేశారు .

ఈ వివాహ విందులో ప్రధాని నరేంద్ర మోడీ ప్రధాన  ఆకర్షణగా నిలిచారు . ప్రియనక తన స్నేహితులను, బంధువులను ఈ వేడుకలకు ఆహ్వానించింది . దంపతులు ఇద్దరు కళ్ళు చెదిరిపోయే వస్త్రాలు ధరించారు . వచ్చిన అతిధులను ప్రియాంక ఆత్మీయంగా రిసీవ్ చేసుకొని వారితో ఫోటోలు తీసుకున్నారు . ఈ వేడుక రెండు గంటలపాటు జరిగినట్టు హాజరైన వారు తెలిపారు .