బోయ్స్‌తో నా స్నేహాన్ని అమ్మ న‌మ్మేది కాదు!-జాన్వీ

అమ్మ న‌న్ను న‌మ్మేది కాదు

అతిలోక‌సుంద‌రి శ్రీ‌దేవి గారాల‌ప‌ట్టి జాన్వీ క‌పూర్ వ‌రుస సినిమాల‌తో పాపుల‌ర్ అయిపోతోంది. `సైరాఠ్‌“ రీమేక్ `ధ‌డ‌క్‌`తో బాలీవుడ్‌లో తెరంగేట్రం చేసిన జాన్వీక‌పూర్ ప్ర‌స్తుతం చేతినిండా సినిమాల‌తో క్ష‌ణం తీరిక లేనంత‌ బిజీగా వుంది. సోష‌ల్ మీడియాలో త‌న అభిమానుల‌తో నిత్యం ట‌చ్‌లో వుంటూ సెన్సేష‌న్‌గా మారిన జాన్వీ తాజాగా ఓ మ్యాగ‌జైన్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ఆస‌క్తిక‌ర విష‌యాల్ని వెల్ల‌డించింది. మ‌గ వారి విష‌యంలో నా అభిప్రాయాలు, అమ్మ అభిప్రాయాలు వేరేగా వుండేవ‌ని, ఆ విష‌యంలో అమ్మ శ్రీ‌దేవి త‌న‌ని అస్స‌లు న‌మ్మేది కాద‌ని బ‌య‌ట‌పెట్టేసింది.

తిరుప‌తిలోనే నా పెళ్లి

శ్రీ‌దేవితో మీ పెళ్లి గురించి ప్ర‌స్తావించారా? అని అడిగితే ఆస‌క్తిక‌ర విష‌యాన్ని బ‌య‌ట‌పెట్టింది. మ‌గ‌వారిని జ‌డ్జ్ చేసే విష‌యంలో నా అభిప్రాయం త‌ప్ప‌ని భావించిన‌ అమ్మ నన్ను అస్స‌లు న‌మ్మేది కాదు. నా కోసం త‌నే వ‌రుడిని ఎంపిక చేస్తాన‌ని అనేది. ఎందుకంటే నేను ఇత‌రుల్ని ఈజీగా న‌మ్మేస్తుంటాను, ప్రేమిస్తుంటాను. నాకు కాబోయే వాడికి హాస్య చ‌తుర‌త వుండాలి. అత‌ని నుంచి నేను తెలుసుకోద‌గ్గ విష‌యాలు వుండాలి. అలాంటి వాడు దొరికితే వెంట‌నే పెళ్లి చేసుకుంటాను. నా పెళ్లి కూడా సంప్ర‌దాయ బ‌ద్దంగా తిరుప‌తిలోనే జ‌రుగుతుంది` అని త‌న మ‌న‌సులో మాట‌ను చెప్పేసింది జాన్వీ.