తాప్సీని డైరక్ట్ గా టార్గెట్ చేస్తూ దారుణ కామెంట్స్

మంచు మనోజ్ సరసన చేసిన ‘ఝుమ్మంది నాదం’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన డిల్లీ బ్యూటీ తాప్సీ. ఇక్కడ హీరోయిన్‌గా నిలదొక్కుకోవడంలో విఫలమవటమే కాక, స్టార్ హీరోయిన్‌ హోదాని దక్కించుకోలేకపోయింది. తమిళంలోనూ ఆమెకు కలిసిరాలేదు. దీంతో బాలీవుడ్ బాట పట్టి అక్కడ నిలదొక్కుకునే ప్రయత్నాలు చేస్తోంది.హిందిలో సినిమాలు చేస్తూనే అడపా దడపా తెలుగులోనూ నటిస్తోంది. 2017లో ‘ఘాజీ’, ‘ఆనందో బ్రహ్మ’ చిత్రాల్లో నటించిన తాప్సీ.. కిందటేడాది ఆదితో కలిసి ‘నీవెవరో’లో నటించింది. రీసెంట్ గా ‘గేమ్ ఓవర్’ అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇలా తన కెరీర్ లో ముందుకు వెళ్తున్న తాప్సీని చూస్తే కంగనా రనౌట్ చెల్లెలు రంగోలికి కాలుతున్నట్లుంది. తన ట్వీట్స్ తో తాప్సీకు చురకలు వేసే ప్రయత్నం చేసింది.

తాప్సీని ఉద్దేశిస్తూ ఆమె తన సోదరి కంగనాకు జెరాక్స్ కాపీ అంది. అంతేకాకుండా కంగనా రనత్ నటనకు మిమిక్రీ వెర్షన్ లాంటిది తాప్సీ అంది. తాప్సీకు ఆఫర్స్ రావటం వెనుక ఆమె అతి తక్కువ రెమ్యునేషన్ అని, కంగనాని ఇమిటేట్ చేయటమే అని తేల్చింది. ఓ రకంగా కంగనాకు రావాల్సిన ఆఫర్స్ ని తాప్సీ కొట్టుకుపోతున్నట్లు తేల్చింది. అయితే ఈ విషయమై ఇంకా తాప్సీ ఏమీ స్పందించలేదు.

ఇంతకు ముందు కూడా కంగన, రంగోలి కలిసి హృతిక్ రోషన్ పై కామెంట్స్ చేసారు. అలాగే రంగోలి ..అలియా భట్ ని టార్గెట్ చేసింది. మణికర్ణిక వివాద సమయంలో తన సోదరికి సపోర్ట్ ఇవ్వలేదని అంది. అంతేకాదు మన తెలుగు దర్శకుడు క్రిష్ యాటిడ్యూట్ ప్లాబ్లమ్స్ అని అంది. తన సోదరి మణికర్ణిక ని రీ షూట్ చేయటం తట్టుకోలేకపోయాడని అంది.