ఇటలీ వెళ్లిన  దీపికా ,రణ్వీర్

బాలీవుడ్ లో ఇప్పడు జరగబోతున్న దీపికా రణ్వీర్ల పెళ్ళీపైనే అందరి ద్రుష్టి వుంది. ఇటలీ లోని లేక్ కొమో లో ఈ నెల 14, 15 తేదీల్లో కొంకణి , సింధీ  సంప్రదాయ పద్ధతుల్లో వివాహం జరుగుతుంది . గత రాత్రి దీపికా పదుకొనె , రణ్వీర్ సింగ్  ఇటలీ  బయలుదేరి వెళ్లారు . అక్కడ వేడుక జరిగే విల్లాలో ఏర్పాట్లు మొదలయ్యాయి .  దీపిక వివాహానికి కావలసిన బట్టలు, నగలు ఇప్పటికే కొన్నది . దీపికా ముంబైలో వున్నా అంధేరి జువలరీ షాపులో పెళ్లి నగలు తీసుకుంది . పెళ్లి రోజున రణ్వీర్ కట్టే మంగళ సూత్రం 20 లక్షల ఖరీదు చేస్తుందట . అలాగే పెళ్లిరోజు రణ్వీర్ ధరించటానికి ఖరీదైన గొలుసు తీసుకున్నదట . ఆ షాపులో కోటి రూపాయల నగలు కొన్నట్టు సమాచారం .

14న దీపిక కుటుంబ సంప్రదాయం ప్రకారం అంటే కొంకణి పద్ధతుల్లో దీపికా రణ్వీర్  కళ్యాణం  జరుగుతుంది . 15వ తేదీన సింధు సంప్రదాయం ప్రకారం వివాహం జరుగుతుంది . వివాహ సమయానికి అటు బెంగళూరు ఇటు ముంభై నుంచి అతిధులు ఇటలీ  వెడతారు . వివాహం అయిన తరువాత 18న ముంబైకి తిరిగి వస్తారు .

21వ తారీఖున బెంగళూరులో వీరి వివాహ విందు జరుగుతుంది . ఇక ముంబైలో డిసెంబర్ 1వ తేదీన రిసెప్షన్  ఇస్తున్నట్టు సమాచారం .