ఈరోజే బెంగుళూర్ లో దీపికా వీర్ ల విందు

ఈనెల 14, 15 తేదీల్లో ఇటలీలో వివాహం చేసుకొని భార్యాభర్తలైన దీపికా పదుకొనె , రణ్వీర్ సింగ్  వివాహ విందు ను ఈరోజు బెంగళూరులో ఇస్తున్నారు.

దీపికా పదుకొనె కన్నడ అమ్మాయి. ఆమె తండ్రి ప్రకాష్ పదుకొనె . బాడ్మింటన్ ఆటగాడు . దీపికా పదుకొనె  బెంగళూరులోనే పెరిగింది . ముందు కన్నడ సినిమాతోనే హీరోయిన్ గా పరిచయం అయ్యింది .

దీపికా రణ్వీర్ ఇద్దరు మూడు విజయవంతమైన సినిమాల్లో కలసి నటించారు . హిందీ సినిమా రంగంలో విజయవంతమైన జంటకా పేరు తెచ్చుకున్నారు . ఇటలీలో ముందు కొంకిణి సంప్రదాయం ప్రకారం వివాహం జరిగింది . ప్రకాష్ పదుకొనె  నూతన దంపతుల కోసం బుధవారం రాత్రి బెంగళూరులో వివాహ విందు ఏర్పాటు చేశారు . ఈ విందులో కన్నడ సినిమా రంగంలోని ప్రముఖులు, ప్రకాష్ బంధువులు పాల్గొంటారు .

ఈ వారాంతంలో ముంబైలోని ఓ స్టార్ హోటల్ లో  రణ్వీర్ సింగ్ సోదరి  రితిక  భావనాని  మరొక విందు ఇవ్వబోతుంది . ఇప్పటికే ఈ విందుకు సంబంధించి ఆహ్వాన పత్రాలు పంపించడం  జరిగింది . డిసెంబర్ 1 న దీపికా , రణ్వీర్ కలసి అతి పెద్ద విందు ముంబై లో ఏర్పాటు చెయ్యబోతున్నారు .