షారుక్ ఖాన్ పై సిక్కు  సంఘాలు మండిపాటు -పోలీసులకు ఫిర్యాదు

షారుక్ ఖాన్ పై భారతీయ సిక్కు సంఘాలు మండి పడుతున్నాయట . తమ మత  విశ్వాసాలను  జీరో సినిమా ట్రైలర్లో చూపించి దెబ్బ తీశారని  అందుకే ఈ విషయంలో చర్య తీసుకొమ్మని  ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశారు .

షారుక్ ఖాన్ మరుగుజ్జు పాత్రలో నటిస్తున్న జీరో సినిమాను 200 కోట్లతో నిర్మిస్తున్నారు . షారుక్ పక్కన కత్రినా కైఫ్ , అనుష్క శర్మ హీరోయిన్లు గా నటిస్తున్నారు  ఆనంద్ ఎల్  రాజ్ దర్శకత్వం వహిస్తున్నాడు . ఈ సినిమాలోని  ట్రైలెర్ను ఇటీవలే విడుదల చేశారు . ఈ ట్రైలర్ చూసిన  సిక్కు సంఘాలు  ఢిల్లీ లోని గురుద్వారా మానేజ్ మెంట్ ప్రధాన కార్యదర్శి కి ఫిర్యాదు చేశాయి . దీనిపై స్పందించిన మన్ జిందర్ సింగ్ సిర్సా  ఢిల్లీ  నార్త్ అవెన్యూ  పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు .

జీరో సినిమా ట్రైలర్ లో షారుక్ ఖాన్ తన మేడలో తమ మతంలో పవిత్ర మైన ” గాత్ర కేర్పన్ ” ధరించి వున్నదని అది తమకు అభ్యన్తర కరమని   సిర్సా పోలీసులకు చెప్పి వెంటనే  తగిన చర్య తీసుకొమ్మని కోరాడు .