మ‌రో న‌టుడు ఆత్మ‌హ‌త్య‌..శోక సంద్రంలో ప‌రిశ్ర‌మ‌

బాలీవుడ్ ని వ‌రుస మ‌ర‌ణాలు వెంటాడుతున్నాయి. ఇప్ప‌టికే ప‌లువురు సెల‌బ్రిటీలు వ‌రుస‌గా మృతి చెంద‌డంతో ప‌రిశ్ర‌మ భ‌యాందోళ‌న‌కు గ‌ర‌వుతుంది. ఎన్న‌డు లేని విధంగా 2020 ఏడాదిలో అన్నీ విషాద ఘ‌ట‌న‌లే చోటు చేసుకుంటున్నాయి. న‌టుడు సుషాంత్ సింగ్ బ‌ల‌వ‌న్మ‌ర‌ణం త‌ర్వాత ప‌రిశ్ర‌మ లో ఆందోళ‌న ఎక్కువైంది. ఇప్పుడిప్పుడే సుషాంత్ మ‌ర‌ణం నుంచి అభిమానులు, ప్రేక్ష‌కులు కోలుకుంటున్నారు. ఈ నేప‌థ్యంలో తాజాగా మ‌రాఠీ న‌టుడు అశుతోష్ భాక్రే ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. మ‌హ‌రాష్ర్ట‌లోని నాందేడ్ లో త‌న ఇంట్లో ఉరేసుకుని బ‌ల‌వ‌న్మ‌ర‌ణానికి పాల్ప‌డ్డ‌డాడు. ఇంట్లో అశుతోష్ వేలాడుతూ క‌నిపించ‌డంతో కుటుంబ స‌భ్యులు భ‌యాందోళ‌న‌కు గుర‌య్యారు.

దీంతో ఆ ప్రాంగ‌ణంలో విషాద ఛాయ‌లు అలుముకున్నాయి. మ‌రాఠీ ప‌రిశ్ర‌మ శోక సంద్రంలో మునిగిపోయింది. అశుతోష్ నెల రోజుల క్రితం నాందేడ్ కు వ‌చ్చాడు. ఉన్న‌ట్లుండి ఇలాంటి నిర్ణ‌యం తీసుకోవ‌డం వెనుక కార‌ణం ఏంట‌న్న‌ది ఇంకా తెలియ‌రాలేదు. న‌టి దేశ్ ముఖ్ ను 2016లో అశుతోష్ వివాహం చేసుకున్నాడు. కొద్ది రోజుల క్రిత‌మే ఇద్ద‌రు ఇంటికెళ్లారు. ఇంత‌లోనే ఇలాంటి నిర్ణ‌యం తీసుకుని అశుతోష్ నింగికెగ‌సాడు. అశుతోష్ మ‌రాఠీ ప‌రిశ్ర‌మ‌లో పెద్ద పేరున్న న‌టుడు. ఎచార్ తార్లా ప‌క్కా అనే సినిమాతో అశుతోష్ కి మంచి పేరొచ్చింది. ఆ త‌ర్వాత అశుతోష్ మ‌రింత‌ న‌టుడిగా బిజీ అయ్యాడు.

ప్ర‌స్తుతం చేతిలో చాలా సినిమాలున్నాయి. మ‌రాఠీ ప‌రిశ్ర‌మ‌లో ఇంకా బోల‌డంత భ‌విష్య‌త్ ఉంది. కానీ ఇంత‌లోనే ఊహించ‌ని నిర్ణ‌యం తీసుకుని అభిమానుల‌ను నిరాశ‌లో ముంచాడు. ఆత్మ‌హ‌త్య‌పై పోలీసులు అనుమాన‌ద‌స్ప‌ద మృతిగా కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్నారు. ప్ర‌స్తుతం సుషాంత్ సింగ్ మ‌ర‌ణంపై పోలీసులు స‌మ‌గ్రంగా ద‌ర్యాప్తు చేస్తున్న సంగ‌తి తెలిసిందే. త‌మ కుమారుడు ఆత్మ‌హ‌త్య చేసుకునేంత పిరికివాడు కాద‌ని..అత‌న్ని ఆత్మ‌హ‌త్య చేసార‌ని ఆరోపించ‌డంతో కేసులో కొత్త ట్విస్ట్ వ‌చ్చింది. అలాగే సుషాంత్ ప్రియురాలి రియా చ‌క్ర‌వ‌ర్తి కూడా సీబీఐ విచార‌ణ చేప‌ట్టాల‌ని డిమాండ్ చేసిన సంగ‌తి తెలిసిందే.