‘విరాటపర్వం’లో  దళారుల వ్యవస్థ !  

 
రానా – సాయి పల్లవి కలిసి చేస్తున్న చిత్రం ‘విరాటపర్వం‘.  ‘నీది నాది ఒకే కథ’ అనే చిన్న సైజు  కథలో కొత్త సంఘర్షణను జోడించి మంచి విజయాన్ని అందుకున్నాడు డైరెక్టర్ ‘వేణు ఉడుగుల’.  అయితే ప్రస్తుతం ఈ డైరెక్టర్ తన రెండో సినిమాగా  ‘విరాటపర్వం’  అనే పొలిటికల్‌ పీరియాడిక్  థ్రిల్లర్ ను తెరకెక్కిస్తున్న సంగతి  తెలిసిందే. కాగా పేరుకు  పొలిటికల్‌ థ్రిల్లర్ అయినా కథలో మాత్రం కొత్త కోణాలు చాలా ఉన్నాయని..  ముఖ్యంగా  రానా పాత్రలో  కొంత నెగిటివ్ యాంగిల్ ఉంటుందట. 
 
అది సినిమాలో కొత్తగా అనిపిస్తోందని.. మొత్తంగా  మంచి కోసం పోరాడే  ఓ చెడ్డ వాడి కథనే.. థ్రిల్లింగ్ అంశాలతో  ఓ కొత్త కోణంలో   డైరెక్టర్  వేణు ఉడుగుల  చెప్పబోతున్నట్లు  తెలుస్తోంది. కాగా తెలంగాణ ప్రాంతంలోని  1980 – 90 నాటి సామాజిక పరిస్థితుల ఆధారం చేసుకుని ఈ పీరియాడిక్ సోషల్ డ్రామాను  వేణు ఉడుగుల  రాసుకున్నాడట.  అంటే అప్పటి దళారుల వ్యవస్థను సినిమాలో  మెయిన్ విలన్ గా చూపిస్తున్నారేమో. 
 
ఇక ఈ సినిమాను హిందీ, తమిళ భాష‌ల్లోనూ రిలీజ్ చేయనున్నారు.  నక్సలైట్ ఉద్యమం నేపథ్యంలో సాగే ఈ కథలో  రానా నక్సలైట్ గా నటిస్తున్నాడట.  ఈ చిత్రంలో ప్రియ‌మ‌ణి ఒక కీల‌క పాత్ర‌లో నటిస్తోంది.  డి. సురేష్‌బాబు, సుధాక‌ర్ చెరుకూరి సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ సినిమాలో బాలీవుడ్ ఫేమ‌స్ న‌టి నందితా దాస్‌, ఈశ్వ‌రీరావు, జ‌రీనా వ‌హాబ్ ప్ర‌ధాన పాత్ర‌లు చేస్తున్నారు.