జయలలిత సినిమా కోసం భరతనాట్యం నేర్చుకుంటున్న కంగనా!

ఒకప్పుడు హీరోయిన్ల కు కథా నాయిక ప్రాధాన్యం ఉన్న సినిమాలు తక్కువగా దొరికేవి. ఉన్నంతంలో గొప్పగా చేసి పేరు తెచ్చుకునేవారు. కానీ ఇప్పుడు, కెరీర్ ప్రారంభించిన తొలినాళ్ళల్లోనే హీరోయిన్లు కథా నాయిక ప్రాధాన్యం ఉన్న సినిమాలు చేస్తున్నారు. ఇది మంచి పరిణామమే అంటోంది కంగనా రనౌత్.

ప్రస్తుతం ఆమె ‘పంగా’, ‘ధాకడ్‌’తో పాటు తమిళం, హిందీలో రూపొందే జయలలిత బయోపిక్‌ ‘తలైవి’లో నటించబోతుంది. ఆనాటి కాలాన్ని ప్రతిబింబించేలా రెట్రో స్టయిల్‌లో ఈ పాట సాగుతుంది. ఇందులో కంగనా పాల్గొననుంది. దీని కోసం ఆమె భరతనాట్యం కూడా నేర్చుకుంటుందట.

జయలలిత సినిమాల్లోకి రాకముందు పలు నాట్య ప్రదర్శనలు ఇచ్చారు. ఆ అంశాలన్నీ ఈ బయోపిక్‌లో ఉంటాయట.