రాష్ట్ర‌ప‌తి భ‌వ‌న్‌లో క్రిష్ సినిమా! రామ్‌నాథ్ కోవింద్‌ కోసం స్పెష‌ల్ స్క్రీనింగ్‌

మ‌న తెలుగువాడు క్రిష్ జాగ‌ర్ల‌మూడి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన బాలీవుడ్ మూవీ `మ‌ణిక‌ర్ణిక‌`. ఝాన్షీ ల‌క్ష్మీబాయి జీవిత చ‌రిత్ర ఆధారంగా తెర‌కెక్కిన సినిమా ఇది. బాలీవుడ్ క్వీన్ కంగ‌న ర‌నౌత్ ఇందులో టైటిల్ రోల్‌ను పోషించారు. వీర‌నారిగా చెల‌రేగిపోయారు. కంగ‌న.. ల‌క్ష్మీబాయిగా రౌద్ర‌ర‌సాన్ని ప‌లికించారు. ఈ విష‌యం ట్రైల‌ర్‌లోనే క్లియ‌ర్‌గా అర్థ‌మైపోతోంది. ఈ సినిమా రాష్ట్ర‌ప‌తి రామ్‌నాథ్ కోవింద్‌ను ఆక‌ట్టుకుంది. ఈ సినిమా చూడాల‌ని నిర్ణ‌యించుకున్నారు.

దీనికోసం శుక్ర‌వారం రాష్ట్ర‌ప‌తి భ‌వ‌న్‌లో ప్ర‌త్యేకంగా ప్ర‌ద‌ర్శించ‌బోతున్నారు. రామ్‌నాథ్ కోవింద్‌, కంగ‌న ర‌నౌత్‌తో పాటు సినిమా యూనిట్ మొత్తం ఈ సినిమాను రాష్ట్ర‌ప‌తితో క‌లిసి చూడ‌బోతున్నారు. సుమారు 80 శాతం సినిమాను షూట్ చేసిన త‌రువాత మ‌ణిక‌ర్ణిక ప్రాజెక్ట్ నుంచి క్రిష్ త‌ప్పుకొన్నారు. మిగిలిన సినిమాను కంగ‌న తానే సొంతంగా ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఈ నెల 25న ఈ మూవీ విడుదల కాబోతోంది.