కుమార్తె కోసం లండ‌న్‌కు జ‌గ‌న్!

ప్ర‌తిప‌క్ష నేత‌, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షుడు వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి త్వ‌ర‌లో లండ‌న్‌కు వెళ్ల‌నున్నారు. సంక్రాంతి పండగ త‌రువాత భార్య భార‌తీ రెడ్డి, చిన్న కుమార్తె హ‌ర్ష‌తో క‌లిసి ఆయ‌న లండ‌న్ వెళ్తారు. జ‌గ‌న్ పెద్ద కుమార్తె వ‌ర్షా రెడ్డి లండ‌న్‌లో చ‌దువుకుంటున్నారు. వ‌ర్ష ప్ర‌తిష్ఠాత్మ‌క లండ‌న్ స్కూల్ ఆఫ్ ఎక‌న‌మిక్స్ విద్యార్థిని.

ఆమెను చూడ‌టానికి జ‌గ‌న్ కుటుంబంతో క‌లిసి లండ‌న్ వెళ్ల‌నున్నారు. సుమారు వారం రోజుల పాటు ఆయన అక్క‌డే ప‌ర్య‌టిస్తారని అంటున్నారు. రాష్ట్రానికి తిరిగి వ‌చ్చిన త‌రువాత బ‌స్సు యాత్ర నిర్వ‌హిస్తార‌ని తెలుస్తోంది. త‌న సొంత నియోజ‌క‌వ‌ర్గం పులివెందుల లేదా చంద్ర‌బాబు ప్రాతినిథ్యం వ‌హిస్తోన్న కుప్పం నుంచి గానీ బ‌స్సు యాత్ర‌ను ఆరంభిస్తారు.