వైఎస్ సోదరుడు వివేకానంద రెడ్డి హఠాన్మరణం

వైఎస్ జగన్ కుటుంబంలో విషాదం నెలకొంది. దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి సోదరుడు వైఎస్ వివేకానందరెడ్డి శుక్రవారం తెల్లవారుజామున గుండె పోటుతో హఠాన్మరణం చెందారు. పులివెందులలోని స్వగృహంలో ఆయన కన్నుమూశారు. దీంతో కడప జిల్లాలో విషాద నెలకొంది. వివేకానంద రెడ్డి రెండు రోజుల క్రితమే హైదరాబాద్ లో జగన్ తో భేటి అయ్యి రాజకీయాల పై చర్చించారు. ఇంతలోనే విషాదం జరగడంతో అంతా దిగ్భ్రాంతి చెందారు.

గతంలో మంత్రిగా, ఎంపీగా, ఎమ్మెల్సీగా వివేకానందరెడ్డి పని చేశారు. 1989,1994 లో పులివెందుల నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 1999లో ఎంపీగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం ఎన్నికల్లో పోటి చేయకున్నా జగన్ కు సలహాదారుడిగా వ్యవహరిస్తున్నారు.