‘యాత్ర’ పై జగన్‌ స్పందన ఏంటంటే…

దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవితం ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘యాత్ర’. మొన్న శుక్రవారం విడుదలై మార్నింగ్ షోకే హిట్ టాక్ ను, పాజిటివ్ రివ్యూస్ ను సొంతం చేసుకొని బాక్సాఫిస్ వద్ద మంచి కలెక్షన్లను రాబడుతోంది. ఈ నేపధ్యంలో చిత్రం ఫై తాజాగా వైఎస్సార్ తనయుడు వైఎస్సార్ సిపి పార్టీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి ట్విట్టర్ ద్వారా స్పందించారు. ‘యాత్ర’ సినిమాపై జగన్మోహన్‌ రెడ్డి ప్రశంసలు కురిపించారు.

‘ ‘యాత్ర’ సినిమాను విజయవంతంగా విడుదల చేసినందుకు చిత్ర టీమ్ కి అభినందనలు‌. గొప్ప నాయకుడైన వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి పాత్రను సినిమాలో ఎంతో నిబద్ధతతో చూపించినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాను’ అని పేర్కొన్నారు.

జగన్ తండ్రి, దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి చేసిన పాదయాత్ర నేపథ్యంలో ఈ సినిమాను మహి వి. రాఘవ్‌ తెరకెక్కించారు. వైఎస్సార్‌ పాత్రలో మలయాళ సూపర్‌స్టార్‌ మమ్ముట్టి నటించారు. శుక్రవారం విడుదలైన ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో మంచి టాక్‌ అందుకుంటోంది. ఈ సందర్భంగా దర్శకుడు రాఘవ్‌, నిర్మాత విజయ్‌ చిల్లా.. జగన్‌ను కలిశారు. సినిమా గురించి చర్చించారు.

యాత్ర చిత్రానికి విజయ్‌ చిల్లా నిర్మాతగా వ్యవహరించారు. జగపతిబాబు, సుహాసిని, ఆశ్రిత, సచిన్‌ ఖెడేకర్‌, రావు రమేశ్‌, అనసూయ తదితరులు కీలక పాత్రలు పోషించారు.