‘యాత్ర’ ప్రీ రిలీజ్ ఈవెంట్: చీఫ్ గెస్ట్ ఎవరో తెలుసా?

దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి జీవితం ఆధారంగా యాత్ర  టైటిల్తో ఓ  సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. లెజెండరీ నటుడు మమ్ముట్టీ, వైఎస్సార్‌ పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో రాజశేఖర్‌ రెడ్డి చేసిన పాదయాత్రనే ప్రధానంగా చూపించనున్నారు‌. ఈ సినిమాను, ఫిబ్రవరి 8వ తేదీన విడుదల చేయనున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి వదిలిన ట్రైలర్ కి అద్బుతమైనన రెస్పాన్స్ వస్తోంది. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 1వ తేదీన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను వైజాగ్ లో నిర్వహించాలనే ఆలోచనలో దర్శక నిర్మాతలు ఉన్నట్లు సమాచారం.

ఇక ఈ వేడుకకి వైఎస్ జగన్ చీఫ్ గెస్ట్ గా రానున్నట్టు తెలుస్తోంది. వైఎస్ జగన్ తో పాటు ఆయన తల్లి .. భార్య ఇతర కుటుంబ సభ్యులు ఈ వేడుకకి హాజరు కానున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న ఈ సినిమా ప్రమోషన్‌ కార్యక్రమాలను వేగవంతం చేసింది చిత్ర యూనిట్ .

70 ఎమ్‌ఎమ్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై విజయ్‌ చిల్ల, శశి దేవిరెడ్డి నిర్మిస్తున్నారు. మహి వి రాఘవ్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో జగపతిబాబు, సుహాసిని, రావు రమేశ్‌, అనసూయ, పోసాని కృష్ణమురళి, వినోద్‌ కుమార్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. కె సినిమాకు సంగీతం అందిస్తున్నారు. ఫిబ్రవరి 8న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు.