YS Jagan Celebrate Diwali: మాజీ సీఎం జగన్ ఇంట్లో మెరిసిన దీపావళి వెలుగులు: భారతితో కలిసి ఫైర్ క్రాకర్స్ కాల్చిన జగన్

మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన నివాసంలో దీపావళి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. బెంగళూరులోని ఆయన నివాసంలో సతీమణి వైఎస్ భారతి రెడ్డితో కలిసి ఆయన టపాసులు పేల్చారు. ఈ సందర్భంగా ఆయన ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు.

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇంట్లో దీపావళి వేడుకలు అత్యంత ఉల్లాసంగా, సంప్రదాయబద్ధంగా జరిగాయి. బెంగళూరులోని తమ నివాసంలో ఆయన సతీమణి వైఎస్ భారతి రెడ్డితో కలిసి దీపావళి పండుగను ఆనందోత్సాహాల మధ్య జరుపుకున్నారు.

ఈ సందర్భంగా వైఎస్ జగన్, భారతి దంపతులు సంప్రదాయ దుస్తులు ధరించి పలు రకాల టపాసులు కాల్చారు. టపాసుల వెలుగులు, శబ్దాల మధ్య ఆ ప్రాంతం దీపావళి శోభతో వెలిగిపోయింది.

పండుగ సందర్భంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ ప్రత్యేకంగా దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. “దీపావళి పండుగ అందరి జీవితాల్లో మరిన్ని వెలుగులు, సంతోషాలు తీసుకురావాలని, ప్రతి ఇంటా ఆనందం వెల్లివిరియాలని కోరుకుంటున్నాను,” అని ఆయన ఆకాంక్షించారు.

Political Analyst KS Prasad Sensational Comments On CM Chandrababu Naidu | Uddanam | YS Jagan | TR