షాకింగ్.. ఎర్రన్నాయుడు హత్యలో అచ్చెన్నాయుడు హస్తం లేదా?

“ఈశ్వరుడు నోరిచ్చాడు కదా అని మీరు మైకుల ముందు ఏది బడితే అది మాట్లాడతారని మీ రాజకీయ ప్రత్యర్థులు అంటుంటారు.. దీనిపై మీరు ఏమంటారు..?” ఓ తెలుగు సినిమాలో నోటికి ఫిల్టర్ లేని ఓ రాజకీయ నాయకురాలిని, జర్నలిస్టు పాత్రలో ఉన్న కథానాయకుడు ప్రశ్నిస్తాడు.

తాజాగా వైఎస్సార్ మరణం, ఆ సమయంలో జగన్ గురించి మంత్రి అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలపై తాజాగా ఈ తరహా ప్రశ్నలే ఎదురవుతోన్న వేళ… మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఇవన్నీ ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారడంతోపాటు.. నాడు కింజరాపు ఫ్యామిలీలో ఏమి జరిగింది అనేది హాట్ టాపిక్ గా మారింది.

ఇటీవల మైకుల ముందుకు వచ్చిన మంత్రి అచ్చెన్నాయుడు… వైఎస్సార్ చనిపోయినప్పుడు జగన్ ఎక్కడ ఉన్నారు అంటూ మొదలెట్టి.. వైఎస్సార్ హత్యలో సొంత వారి ప్రమేయం ఉందని ఆరోపించిన సంగతి తెలిసిందే. వైఎస్సార్ మరణించిన ఇన్నేళ్ల తర్వాత ఈ వ్యాఖ్యలు ఎందుకనేది అచ్చెన్నకు, ఆయనను ఉసిగొల్పినవారికే తెలియాలి!

దీనిపై మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఫుల్ క్లారిటీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం మరో అడుగు ముందుకేసి.. అసలు ఎర్రన్నాయుడి విషయంలో జరిగిన సంఘటనల వెనుక ఎవరున్నారంటూ కీలక పాయింట్స్ తెరపైకి తెచ్చారు! అసలు తమ్మినేని ఏమన్నారో ఇప్పుడు చూద్దామ్…!

వైఎస్సార్‌ మరణించిన సమయంలో జగన్‌ మోహన్‌ రెడ్డి విదేశాల్లో ఉన్నారంటూ చేసిన అచ్చెన్న వ్యాఖ్యలను తిప్పికొట్టిన తమ్మినేని సీతారాం… ఆనాడు తండ్రి మరణవార్త విని కుప్పకూలిపోయిన కుటుంబానికి జగన్‌ అండగా ఉన్నారని.. అంత్యక్రియల వరకు అన్ని తానై చూసుకున్న విషయం ప్రపంచం మొత్తానికి తెలుసని తెలిపారు.

అనంతరం… 2009 ఎన్నికల సమయంలో లోక్‌ సభకు పోటీ చేసిన ఎర్రన్నాయుడు మీద జిల్లాలోని సింగుపురం వద్ద జరిగిన బాంబు దాడిలో తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారని.. ఆ హత్యాయత్నం వెనక ఎవరున్నారని సీతారాం ప్రశ్నించారు! ఇదే క్రమంలో… 2012 నవంబర్ లో ఎర్రన్నాయుడు విశాఖ నుంచి శ్రీకాకుళం వస్తుండగా ఆయన కారును లారీ ఢీకొట్టడంతో చనిపోయారని, ఈ యాక్సిడెంట్ వెనక మీ హస్తం ఉందని కొందరు అంటున్నారని, దానికి అచ్చెన్నాయుడు జవాబు చెప్పాలని డిమాండ్ చేశారు!

దీంతో ఈ విషయం ఒక్కసారిగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇదే క్రమంలో గతంలో అచ్చెన్నాయుడు అటు పోలీసులపైనా, ఇటు తన సొంత పార్టీపైనా చేసిన వ్యాఖ్యలను పలువురు గుర్తు చేసుకుంటున్నారు. ఇందులో భాగంగా గతంలో ఓ సారి… ఇంతమంది పోలీసులు ఎందుకు వచ్చారు.. ——– తినడానికా అంటూ బూతులు మాట్లాడిన విషయాన్ని గుర్తు చేసుకుంటున్నారు!

ఇదే క్రమంలో… పార్టీ లేదు, బొక్కా లేదు అని టీడీపీపై విమర్శలు చేసిన విషయాన్ని తలచుకుంటున్నారు. అలాంటి అచ్చెన్నాయుడు, ఈ రోజు రాజకీయ ప్రయోజనాల కోసమే ఈ తరహా దిగజారుడు వ్యాఖ్యలు వైఎస్సార్ మీద, ఆయన కుటుంబంపై చేయడంలో వింతేముందని పలువురు అభిప్రాయపడుతున్నారు!

ఏది ఏమైనా రాజకీయాల్లో విలువలు.. మైకుల ముందు మాట్లాడే నేతలకు విజ్ఞత చాలా అవసరమని… అలాకానిపక్షంలో రాజకీయ అవసరాల కోసం ఎంతకైనా దిగజారతాం.. ఏదైనా మాట్లాడతాం అనే అచ్చెన్న వంటి ఆలోచన కలిగిన నేతల వల్ల… రోజు రోజుకీ నాయకుల పట్ల గౌరవం పూర్తిగా పడిపోయే అవకాశం ఉందని… రాజకీయ అంటేనే రొచ్చు అని తదుపరి జనరేషన్స్ సైతం అనుకునే ప్రమాదం ఉందని.. ఈ స్పృహ కలిగి నేతలు నడుచుకోవాలని పలువురు కోరుకుంటున్నారు!