అఖిల‌ప్రియ కి బెయిల్ వ‌స్తుందా ? రాదా ? … తీవ్ర ఉత్కంఠ

Bhooma Akhila Priya

ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి భూమా అఖిలప్రియ కు సికింద్రాబాద్‌ కోర్టు జడ్జి 14 రోజుల రిమాండ్‌ విధించింది. సీఎం కేసీఆర్ బంధువు, హాకీ మాజీ ఆటగాడు ప్రవీణ్‌ రావు, అతని ఇద్దరు సోదరుల కిడ్నాప్‌ కేసులో అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అరెస్ట్ చేసిన తర్వాత గాంధీ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. వైద్య పరీక్షల రిపోర్టులో ఎలాంటి సమస్య లేదని వైద్యులు తేల్చారు. అనంతరం పోలీసులు ఆమెను జడ్జి నివాసంలో ప్రవేశపెట్టారు. రిమాండ్ విధించడంతో పోలీసులు ఆమెను చంచల్‌గూడ జైలుకు తరలించారు.

will akhila priya get bail

బోయిన్‌పల్లి కిడ్నాప్‌ కేసులో అఖిల ప్రియ ఏ2 గా ఉండగా.. ఆమె భర్త భార్గవ్‌రామ్‌ ఏ3గా, ఆళ్లగడ్డ టీడీపీ నేత ఏవీ సుబ్బారెడ్డి ఏ1 ఉన్నారు. ఏవీ సుబ్బారెడ్డిని సాయంత్రం హైదరాబాద్‌లో పోలీసులు అరెస్ట్ చేశారు. భార్గవ్‌రామ్‌ పరారీలో ఉన్నాడు. బెయిల్‌ మంజూరు చేయాలని కోరుతూ అఖిలప్రియ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. కిడ్నాప్‌ కేసుతో ఎలాంటి సంబంధం లేదని అఖిలప్రియ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. దీంతో బెయిల్‌ పిటిషన్‌పై పబ్లిక్‌ ప్రాసిక్యూషన్‌కు న్యాయమూర్తి నోటీసులు జారీ చేశారు. అఖిలప్రియ బెయిల్‌ పిటిషన్‌పై గురువారం సికింద్రాబాద్‌ కోర్టులో విచారణ జరగనుంది.

అఖిల ప్రియ గర్భిణి కావడంతో దాని‌పై ఉత్కంఠ నెలకొంది. ఆమెను ఈ కేసులో అన్యాయంగా ఇరికించారని ఆమె కుటుంబ సభ్యులు అంటున్నారు. ఆమె భ‌ర్త భార్గవ్ రామ్ ఆచూకీ ఇప్ప‌టికీ దొర‌క‌లేదు. ఆయ‌న కోసం పోలీసులు బృందాలుగా ఏర్పడి గాలింపు చ‌ర్య‌లను కొన‌సాగిస్తున్నారు.