చంద్రబాబుపై సంచలన ఆరోపణలు చేసిన విజయసాయిరెడ్డి

ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడుపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. గత కొంతకాలంగా విజయసాయిరెడ్డి సోషల్ మీడియా ట్విట్టర్ వేదికగా చంద్రబాబుపై విమర్శలు, ఆరోపణలు గుప్పిస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో మరోసారి చంద్రబాబుపై తీవ్ర ఆరోపణలు చేశారు విజయసాయిరెడ్డి. ఇంతకీ ఆయన ఏమన్నారో తెలియాలంటే కింద ఉన్న మ్యాటర్ చదవండి.

విశాఖలో జరుగుతోన్న గంజాయి స్మగ్లింగ్ కి కారణం చంద్రబాబు అంటూ విజయసాయిరెడ్డి ఆరోపణలు చేశారు. గిరిజన యువతకు చంద్రబాబు ప్రభుత్వం ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో విఫలమైందన్నారు. ఈ నేపథ్యంలోనే గిరిజన యువత గంజాయి స్మగ్లింగ్ వైపు ఆసక్తి చూపుతున్నారని ఆయన అన్నారు. గడిచిన నాలుగున్నరేళ్లలో టీడీపీ పాలనలో గంజాయి స్మగ్లింగ్ ఎక్కువైందన్నారు.

విశాఖ నుండి ఇతర రాష్ట్రాలకు గంజాయి తరలించబడుతుంది అనే విషయం రహస్యమేమీ కాదని అన్నారు. చంద్రబాబే గంజాయి స్మగ్లింగ్ ని ప్రమోట్ చేస్తున్నారంటూ హ్యాష్ ట్యాగ్ పెట్టారు. ఇప్పటివరకు రిపోర్ట్స్ ప్రకారం విశాఖలో 47 గంజాయి స్మగ్లింగ్ కేసులు నమోదవగా 117 మంది నిందితులను అరెస్టు చేశారు. వారిలో 50 శాతంపైగా గిరిజన యువతే ఉన్నారు. ఉద్యోగావకాశాలు లేకపోవడం వలనే వారు ఈ బాటపట్టారు అన్నారు. పోలీసులు కూడా సరైన చర్యలు తీసుకోవడంలో విఫలమైందన్నారు. యువతలో మార్పు తీసుకువచ్చే కార్యక్రమాలు చేపట్టాలని, ఇలానే ఎక్కువకాలం వదిలేస్తే వారి మనసు విరిగిపోతుంది అని ఆవేదన వ్యక్తం చేశారు విజయసాయిరెడ్డి.