వేణు మాధవ్ నామినేషన్ తిరస్కరణ

కోదాడ అసెంబ్లీ స్థానానికి నామినేషన్ వేసేందుకు వెళ్లిన ప్రముఖ సినీ హాస్య నటుడు వేణుమాధవ్ కు షాక్ తగిలింది. కోదాడ తహసీల్దారు కార్యాలయంలో నామినేషన్ వేసేందుకు వెళ్లిన ఆయన… పత్రాలను అధికారులకు సమర్పించారు. అవి సరిగా లేకపోవడంతో… నామినేష్ పత్రాలను రిటర్నింగ్ అధికారి తిరస్కరించారు. దీంతో వేణుమాధవ్ తిరిగి వెళ్లిపోయారు.

 ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పూర్తి స్థాయిలో పత్రాలను తయారు చేసుకుని… సోమవారం వస్తానని తెలిపారు. సోమవారమే నామినేషన్ వేస్తానన్నారు. వేణుమాధవ్ స్వస్థలం కోదాడ.  కోదాడ నుంచి ఆయన ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. ప్రజలకు సేవ చేయడానికే తాను రాజకీయాలలోకి వస్తున్నానన్నారు.

వేణుమాధవ్ గతంలో టిడిపి సభలలో మిమిక్రి ఆర్టిస్టుగా పనిచేశారు. టిడిపి నుంచి టికెట్ వస్తుందని ఆశించిన అది సాధ్యం కాకపోవడంతో ఆయన ఇండిపెండెంట్ గా బరిలోకి దిగారని తెలుస్తోంది.