ప్రేమికురాలిని తగులబెట్టి తనను తాను కాల్చుకున్న ప్రేమికుడు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండలం రామాంజనేయ కాలనీలో దారుణం జరిగింది. తన ప్రేమికురాలిని తగులబెట్టిన ప్రేమికుడు తనను తాను కూడా కాల్చుకున్నాడు.

రామాంజనేయ కాలనీకి చెందిన వినోద్ గత కొంత కాలంగా ఓ అశ్విని అనే అమ్మాయితో సహజీవనం చేస్తున్నాడు. గత కొన్ని రోజులుగా వీరిద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఆదివారం రాత్రి కూడా వీరిద్దరి మధ్య గొడవ జరిగింది. దీంతో తన ప్రేమికురాలు తేజస్వినిని పెట్రోల్ పోసి తగులబెట్టి చంపేశాడు. ఆ తర్వాత తాను కూడా కాల్చుకున్నాడు. దీంతో వినోద్ కూడా చనిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.