జగన్ ప్రభుత్వాన్ని మంత్రులే టార్గెట్ చేస్తున్నారు అనడానికి ఇది పెర్ఫెక్ట్ ఉదాహరణ…. !

What has the YCP done to the BCs during the 18 months of government rule

ఏపీ మంత్రుల్లో ఒకరిని ఒకరు టార్గెట్ చేస్తున్నారు అంటూ వైసీపీలో గుస‌గుస వినిపిస్తోంది. గత కొన్ని రోజులుగా ఈ ఇద్దరు మంత్రుల మ‌ధ్య వివాదం న‌డుస్తున్న విష‌యం తెలిసిందే. అయితే, ఎదురు ప‌డిన‌ప్పుడు మాత్రం న‌వ్వుతూ ప‌ల‌క‌రించుకుని.. వెన‌క మాత్రం వెక్కిరించుకుంటున్నారు. దీంతో ఈ ఇద్దరు మంత్రుల విష‌యం హాట్ టాపిక్‌గా మారింది.

New Year's annual budget has become a big challenge for the YCP government!

ఇంత‌కీ విష‌యం ఏంటంటే.. చిత్తూరుకు చెందిన మంత్రికి, విజ‌య‌వాడ‌కు చెందిన కీల‌క మంత్రికి మ‌ధ్య ఎందుకు వివాదం వ‌చ్చింది అంటే , స‌ద‌రు సీమ మంత్రికి.. కోస్తా జిల్లాల్లో మంచి స‌న్నిహితులు ఉన్నారు. ఆయ‌న క‌నుస‌న్నల్లోనే పార్టీ న‌డుస్తోంది. ఇక్కడ ఆయ‌న మాట‌కు మంచి ఫాలోయింగ్ ఉంది. అయితే రాను రాను, విజ‌య‌వాడ మంత్రి వ‌ర్యుల క‌నుస‌న్నల్లోకి వ‌చ్చిన కొంద‌రు నాయ‌కులు ఇక్కడ స‌ద‌రు సీమ కు చెందిన మంత్రిని ఏ మాత్రం లెక్క చేయడం లేదు.

ఇది ఇద్దరు మంత్రుల మ‌ధ్య ఆధిప‌త్యానికి దారితీసింది. పార్టీని బ‌లోపేతం చేయ‌డంలో నేనే ముందున్నాను. ఇప్పటికి ముగ్గురిని పార్టీలోకి తీసుకువ‌చ్చాను.. అంతర్వేది వంటి ఘ‌ట‌న‌లు చెల‌రేగినా.. వ్యూహాత్మకంగా అడ్డుకున్నాను. అని స‌ద‌రు విజ‌య‌వాడ‌కు చెందిన మంత్రివ‌ర్యులు త‌న‌ను తానే పొగుడుకుంటున్నారు. మ‌రోవైపు.. ఇసుక, మ‌ద్యం విష‌యాల్లో ప్రభుత్వం ఇబ్బంది ప‌డుతోంద‌ని.. త‌ల ఎత్తుకోలేక పోతోంద‌ని ప‌రోక్షంగా వ్యాఖ్యలు సంధిస్తున్నారు. మొత్తంగా ఈ ఇద్దరు మంత్రుల వ్యవహారం ఎలా ముగుస్తుందో మరి