తెలుగు ప్రజల పౌరుషం నందమూరి తారక రామారావు: చంద్రబాబు

తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు ఈరోజు
ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఒంగోలులోని అద్దంకి బస్టాండ్ సెంటర్లో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించాడు. భారీ కేకు కూడా కట్ చేసి మీడియాతో మాట్లాడాడు. తెలుగు ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చాడు అని అన్నాడు.

పేదవారికి ఏం కావాలో తెలుసుకుని అందించిన మహా వ్యక్తని మహానాడు లో భాగంగా బహిరంగ సభలో జిల్లా సమస్యలను ప్రస్తావిస్తా అని ఒంగోలులో అభివృద్ధి జరిగిందంటే దామచర్ల జనార్ధన్ కృషియే అన్నాడు. మహానాడు సభకు ఎవరు రాకుండా ఉండాలి అని బస్సులకు అనుమతి ఇవ్వలేదని.. తప్పుడు రాజకీయాలు ప్రజలు ఆమోదించరని జగన్ తెలుసుకోవాలి అని అన్నాడు. ఇక తెలుగు ప్రజల పౌరుషం నందమూరి తారకరామారావు అని అన్నాడు.