ఆదివారం బ్యాంకులకు సెలవు లేదు

మార్చి 31 ఆదివారం ప్రభుత్వరంగ బ్యాంకులకు సెలవు లేదని ఆర్బీఐ ప్రకటించింది. ఆర్ధిక సంవత్సరం ముగింపు రోజు కావడంతో ప్రభుత్వ లావాదేవిలకు ఇబ్బంది కలగకుండా బ్యాంకులు తెరిచి ఉంచాలని ఆదేశించింది.

సోమవారం ఏప్రిల్ 1న సెలవు దినంగా ప్రకటించింది. శనివారం కూడా రాత్రి 8 వరకు బ్యాంకులు పని చేయనున్నాయి. ఆదివారం సాయంత్రం 6 గంటల వరకు బ్యాంకులు పని చేయనున్నాయి.

అలాగే రంగారెడ్డి, వికారాబాద్‌ జిల్లాల్లోని అన్ని శాఖలను తెరిచి ఉంచనున్నట్లు ఆంధ్రాబ్యాంకు ప్రకటించింది.