చంద్రబాబు జోహార్..టిడిపి జోహార్ (వీడియో) 

భవిష్యత్తులో చంద్రబాబునాయుడు పరిస్ధితి ఏంటో పక్కన పెడితే తెలుగుదేశంపార్టీ పరిస్ధితి ఏమిటో మాత్రం ఆ పార్టీ శ్రేణులకు బాగానే అర్ధమైనట్లుంది. తాజాగా నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గంలో టిడిపి సమావేశం జరిగింది.  ఆ సమావేశానికి సీనియర్ నేత, వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డితో పాటు చాలామంది సీనియర్లే పాల్గొన్నారు. ఆ సమావేశం సందర్భంగా అత్యుత్సాహంతోనే లేకపోతే మరోదైనా ప్రభావంతోనే తెలీదు కానీ శ్రేణలు చేసిన నినాదాలు ఇఫుడు పార్టీలో చర్చనీయాంశమైంది.

 

సమావేశం సందర్భంగా ఎన్టీయార్ జోహార్ అని నినాదాలు చేశారు. అక్కడి వరకూ బాగానే ఉంది. ఆతర్వాత  చేసిన నినాదాలే అందరినీ ఆశ్చర్యపరిచింది. ఎన్టీయార్ తో పాటు చంద్రబాబును కూడా పెద్దల్లో కలిపేశారు. ఎన్టీయార్ కు జోహార్లు చెప్పిన నేతలు, శ్రేణులు చంద్రబాబుకు కూడా పనిలో పనిగా జోహార్లంటూ నినాదాలు చేశారు. పోనీ అక్కడితో ఆగారా అంటే అదీలేదు. ఎన్టీయార్, చంద్రబాబుతో పాటు తెలుగుదేశంపార్టీకి కూడా జోహార్లు చెప్పేశారు. టిడిపికి జోహార్ అంటూ గట్టిగా పోటీలు పడిమరీ నినాదాలు చేయటం విచిత్రంగా ఉంది. నేతలు, శ్రేణులు చంద్రబాబుకు, టిడిపికి జోహార్లు చెబుతుంటే వారించాల్సిన మంత్రి సోమిరెడ్డి తదితర సీనియర్ నేతలు ముసిముసిగా నవ్వుకోవటం ఆశ్చర్యంగా ఉంది.

మామూలుగా అయితే చనిపోయిన వారిని  కీర్తించేందుకు జోహార్లు చెబుతారు. జీవించి ఉన్న వారిని కీర్తించాలంటే జిందాబాద్ అంటారు. నేతలు, శ్రేణుల వరస చూస్తుంటే నారావారి వంశాకురం నారా లోకేష్, నందమూరి యువరత్నం బాలకృష్ణ నే ఫాలో అవుతున్నట్లుంది. లోకేష్ ఏమో జయంతికి, వర్ధంతికి తేడా తెలీకుండా మాట్లాడి నవ్వుల పాలయ్యారు. ఇక చంద్రబాబు బావమరిది కమ్ హిందుపురం ఎంఎల్ఏ కమ్  లోకేష్  మామగారైన నందమూరి బాలకృష్ణ రెండు రోజుల క్రితం మాట్లాడుతూ తన సోదరుడు నందమూరి హరికృష్ణ రోడ్డు ప్రమాదంలో హఠాత్తుగా మరణించటం తనను సంభ్రమాశ్చర్యంలో ముంచెత్తిందని ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు.