జగన్ శత్రువులు అంటే బాలయ్యకు ఇంత ఇష్టమా.. వాళ్లనే ఆహ్వానిస్తారా?

Kodali Nani didn't care about Balakrishna 

బాలయ్య అన్ స్టాపబుల్ సీజన్1 కు గెస్ట్ లుగా హాజరైన వాళ్లంతా సినీ సెలబ్రిటీలు అనే సంగతి తెలిసిందే. అయితే అన్ స్టాపబుల్ సీజన్2 ను మాత్రం బాలయ్య తన పొలిటికల్ కెరీర్ కు కూడా ప్లస్ అయ్యే విధంగా వాడుకుంటున్నారని ఆరోపణలు వినిపిస్తుండటం గమనార్హం. అన్ స్టాపబుల్ సీజన్2 తొలి ఎపిసోడ్ కు చంద్రబాబు గెస్ట్ గా హాజరయ్యాయనే సంగతి తెలిసిందే. ఈ షోలో చంద్రబాబు జగన్ పేరు చెప్పకుండానే విమర్శలు చేశారు.

ఈ శుక్రవారం ప్రసారం కాబోయే అన్ స్టాపబుల్ ఎపిసోడ్ కు మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గెస్ట్ గా హాజరు కానున్నారని సమాచారం అందుతోంది. కిరణ్ కుమార్ రెడ్డి కొంతకాలం పాటు జగన్ కు వ్యతిరేకంగా వ్యవహరించారు. ఈయన చంద్రబాబు సన్నిహితులలో ఒకరు కావడం గమనార్హం. కిరణ్ కుమార్ రెడ్డి ఉమ్మడి ఏపీకి ముఖ్యమంత్రిగా వ్యవహరించిన సమయంలో ఏపీకి కలిగిన లాభం కంటే నష్టమే ఎక్కువనే సంగతి తెలిసిందే.

అయితే జగన్ శత్రువులను ఆహ్వానిస్తూ జగన్ కు వ్యతిరేకంగా ప్రచారం జరిగే దిశగా బాలయ్య అడుగులు వేస్తుండటంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జగన్ శత్రువులు అంటే బాలయ్యకు అంత ఇష్టమా అని కొంతమంది వ్యంగ్యంగా కామెంట్లు చేస్తున్నారు. బాలయ్య రేంజ్ కు తగిన అతిథులు ఈ షోకు హాజరు కాకపోవడంపై కూడా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

బాలయ్య డైరెక్ట్ గా జగన్ సర్కార్ పై విమర్శలు చేయలేక ఈ విధంగా జగన్ సర్కార్ ను టార్గెట్ చేస్తున్నారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. జగన్ సర్కార్ ను పదేపదే టార్గెట్ చేయడం వల్ల నష్టపోయేది మాత్రం టీడీపీనే అనే సంగతి తెలిసిందే. టీడీపీ పాలన నచ్చకపోవడం వల్ల ప్రజలు వైసీపీకి అవకాశం ఇచ్చారు. ప్రజలు మళ్లీ టీడీపీకి అవకాశం ఇస్తారా అనే ప్రశ్నకు కాదనే సమాధానం వినిపిస్తోంది.