ఏపీ మంత్రి దేవినేని ఉమకు షాక్.. జగన్ తో భేటి అయిన ఉమ సోదరుడు

ఏపీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు సోదరుడు దేవినేని చంద్రశేఖర్ వైసీపీలో చేరనున్నారు. సోమవారం ఉదయం హైదరాబాదులోని లోటస్ పాండ్ లో ఆ పార్టీ అధినేత జగన్ తో ఆయన భేటీ అయ్యారు. విజయవాడలో జరగనున్న వైసీపీ భారీ బహిరంగసభలో చంద్రశేఖర్ ఆ పార్టీ కండువా కప్పుకోనున్నారు.

ఈ సందర్భంగా మీడియాతో చంద్రశేఖర్ మాట్లాడుతూ, టీడీపీలో అవినీతి విపరీతంగా పెరిగిపోయిందని అన్నారు. ఇరిగేషన్ ప్రాజెక్టుల్లో భారీ ఎత్తున దోపిడీ జరుగుతోందని ఆరోపించారు. మైలవరం నియోజవర్గంలో వైసీపీని భారీ మెజార్టీతో గెలిపిస్తామని చంద్రశేఖర్ తెలిపారు. ఇరిగేషన్ మంత్రిగా దేవినేని ఉమా ఉన్న సంగతి తెలిసిందే. మరోవైపు మైలవరం నుంచి టీడీపీ అభ్యర్థిగా దేవినేని ఉమా పోటీ చేస్తారని ఇప్పటికే ఆ పార్టీ అధిష్ఠానం ఫిక్స్ చేసింది. ఈ నేపథ్యంలో అన్నదమ్ముల మధ్య ఎన్నికల పోరు రసవత్తరంగా ఉండే అవకాశం ఉంది.