ఫోర్జరీ కేసు: సుప్రీంలో అయ్యన్నకి చుక్కెదురు!

టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు ఫోర్జరీ కేసు వ్యవహారం సుప్రీం కోర్టుకు చేరిన సంగతి తెలిసిందే. అయితే ఈ కేసుపై దర్యాప్తునకు సుప్రీంకోర్టు తాజాగా అనుమతినిచ్చింది. ఫోర్జరీ సెక్షన్ల ఐపీసీ 467 కింద దర్యాప్తు చేయవచ్చని ఉన్నతన్యాయస్థానం స్పష్టం చేసింది.

తాజాగా అయ్యన్న పై దాఖలైన పిటిషన్‌ పై సుప్రీంలో విచారణ జరిగింది. ఈ క్రమంలో అయ్యన్నపై ఫోర్జరీ కేసు దర్యాప్తునకు అనుమతినిస్తూ జస్టిస్‌ ఎంఆర్‌ షా, జస్టిస్‌ సీటీ రవికుమార్‌ ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. అంతేకాకుండా.. ఫోర్జరీ సెక్షన్ల ఐపీసీ 467 కింద దర్యాప్తు చేయవచ్చని ఉన్నతన్యాయస్థానం స్పష్టం చేసింది. ఈ క్రమంలో… ఈ కేసుకు సంబందించి గతంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీం కొట్టివేసింది.

కాగా… బిల్డింగ్‌ ప్లాను విషయంలో నీటిపారుదల శాఖ అధికారి సంతకాలు ఫోర్జరీ చేశారన్న కేసులో అయ్యన్నపాత్రుడుపై ఆరోపణలు ఉన్న విషయం తెలిసిందే.

అయితే… జగన్మోహన్ రెడ్డి అరాచక పాలనకు పరాకాష్ఠ అయ్యన్నపాత్రుడి అక్రమ అరెస్ట్ అంటూ గతంలో బాబు విమర్శలు చేశారు. తాజాగా… ఈ కేసును విచారణ చేయొచ్చని.. పదేళ్లకు పైగా శిక్ష పడే సెక్షన్ 467 కింద దర్యాప్తు చేయొచ్చని సుప్రీం స్పష్టం చేసింది.