మరికొన్ని గంటల్లో కూతురు పెళ్లి… ఇంతలోనే తల్లి

కొద్ది గంటల్లో తన కుమార్తె వివాహం చూడాల్సిన తల్లి ఆ ముచ్చట చూడకుండానే కన్నుమూసింది. రోడ్డు ప్రమాదంలో తల్లి చనిపోయిన విషయాన్ని దాచి ఆ యువతి వివాహం జరిపించారు. ఈ విషాద ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురంలో జరిగింది.

బుడుగు బజారుకు ప్రవీణకు మొండికుంటకు చెందిన యువకునితో గురువారం తెల్లవారు జామున వివాహం జరగాల్సి ఉంది. దీంతో వధువు, బంధువులు అంతా కలిసి బుధవారం రాత్రి అశ్వాపురం నుంచి బయల్దేరారు. వధువు తల్లి ప్రయాణిస్తున్న కారు చింతిర్యాల వద్ద అదుపు తప్పి రోడ్డు పక్కనున్న చెట్టును ఢీకొట్టింది.  ఈ ప్రమాదంలో వధువు తల్లి చనిపోయింది.

వధువు తల్లి మృతితో పెళ్లి ఆగిపోతుందని ఆలోచించిన బంధువులు వధువుకు తెలియకుండా జాగ్రత్త పడి పెళ్లి చేశారు. ఆ తర్వాత విషయం తెలుసుకున్న అంతా విషాద చాయల్లో మునిగిపోయారు. ప్రవీణ విలపించిన తీరును చూసి అక్కడ ఉన్న వారు భోరుమన్నారు.